అమ్మను చూడకనే.. అనంత లోకాలకు
చిన్నకారొకటి.. చోదకుడి నిర్లక్ష్యం.. రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలను బలిగొంది. దీక్ష తీసుకుని నలుగురొక బృందంగా విజయవాడ అమ్మ దర్శనానికి చేస్తున్న పాదయాత్రను ఈ దుర్ఘటన విషాదాంతం చేసింది.
భవానీలను సమీపిస్తున్న కారు... ఢీ కొట్టిందిలా.. చెల్లాచెదురుగా భక్తులు
తుని పట్టణం, న్యూస్టుడే: చిన్నకారొకటి.. చోదకుడి నిర్లక్ష్యం.. రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలను బలిగొంది. దీక్ష తీసుకుని నలుగురొక బృందంగా విజయవాడ అమ్మ దర్శనానికి చేస్తున్న పాదయాత్రను ఈ దుర్ఘటన విషాదాంతం చేసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం
నుజ్జయిన కారు ముందు భాగం
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన భవానీలు రావి సంతోష్ (28), నల్ల ఈశ్వరరావు (38), మహేష్, జి.గిరి స్వగ్రామం నుంచి విజయవాడకు కాలినడకన గత నెల 26న మధ్యాహ్నం బయల్దేరారు. వారు శుక్రవారం రాత్రి తుని జాతీయ రహదారి సమీపాన పాయకరావుపేట వద్ద అమ్మవారి ఆలయంలో బస చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు పూజ చేసుకుని యాత్రను కొనసాగించారు. డీమార్ట్ దాటాక ఒక డాబా వద్దకు చేరుకునే సరికి సుమారు 6.30 గంటల సమయంలో మృత్యువులా చిన్నకారు వెనుక నుంచి దూసుకువచ్చింది. ముందు ఇద్దరు.. వెనుక ఇద్దరు రోడ్డుకు బాగా పక్కగా వారు నడచి వెళుతుండగా, విశాఖపట్నం నుంచి అనపర్తి మండలం కొమరిపాలెం వెళ్తున్న కారు అతి వేగంగా వీరిపైకి దూసుకొచ్చింది. కుడివైపు టాటామ్యాజిక్ వాహనం వెళ్తుండగా దాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అతివేగంగా వచ్చి అదుపుతప్పి సంతోష్, ఈశ్వరరావులను ఢీకొట్టింది. వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మిగతా ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తమతో నడుచుకుంటూ వచ్చిన వారిలో ఇద్దరు ఎక్కడపడ్డారో.. ఏం జరిగిందో అర్థంకాక ఈ ఇద్దరూ బోరున విలపించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కారు డ్రైవర్ సూర్యతేజను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్ఛార్జి సీఐ సన్యాసిరావు తెలిపారు.
పెనసాంలో విషాద ఛాయలు
శ్రీకాకుళంలో బయలుదేరిన సంతోష్, ఈశ్వరరావు (పాతచిత్రం)
జి.సిగడాం: జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన ఇద్దరు భవానీ భక్తులు దుర్మరణం పాలవ్వడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రావి సంతోష్ 2019లో సంధ్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వ్యవసాయమే ఆధారం.
* నల్ల ఈశ్వరరావుకు భార్య నీలవేణి, తల్లిదండ్రులు, అన్నయ్య కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈశ్వరరావుకు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. విద్యుత్ పనులు చేస్తూ తమను పోషిస్తున్నాడని, ఇప్పుడు ఎవరు దిక్కు అని ఈ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం