Andhra News: హెడ్‌నర్సుతో ఎంపీ పీఏ అసభ్య ప్రవర్తన

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ ఎంపీ పీఏ తన నీచబుద్ధిని చూపాడు. ప్రసూతి సేవలు అందించే ఓ హెడ్‌నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Updated : 17 Feb 2023 06:53 IST

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ ఎంపీ పీఏ తన నీచబుద్ధిని చూపాడు. ప్రసూతి సేవలు అందించే ఓ హెడ్‌నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. రెండ్రోజుల కిందట ఓ ఎంపీ పీఏ.. ఆస్పత్రి అధికారులకు ఫోన్‌ చేసి తమ బంధువులు ప్రసూతి సేవల కోసం వస్తున్నారని చెప్పారు. ఎంపీ పీఏ కావడంతో అధికారులు మరింత శ్రద్ధచూపారు. బుధవారం రాత్రి ఓ హెడ్‌నర్సు ఆ వార్డులో ఉండగా.. పీఏ ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వెంటనే ఆమె భయంతో పరుగులు తీసి.. సహచర నర్సులతో చెప్పడంతో వారు డీసీహెచ్‌ఎస్‌ బీసీకే నాయక్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినా అతడు ఎంపీ పీఏ, మంత్రికి సన్నిహితుడు కావడంతో ఏం జరుగుతుందోనని నర్సులందరూ ఆలోచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని