Mulugu: మిత్రులతో కలిసి నమ్మి వచ్చినందుకు కాటేశాడు!
హనుమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఏడుగురు మిత్రులు కలిసి ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా పర్యటనకు వెళ్లారు.
డిగ్రీ విద్యార్థినిపై విద్యార్థి అత్యాచారం
భీమారం, న్యూస్టుడే: హనుమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఏడుగురు మిత్రులు కలిసి ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా పర్యటనకు వెళ్లారు. అందులోని ఓ విద్యార్థినిపై కన్నేసిన విద్యార్థి... తిరుగు ప్రయాణంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై సోమవారం కేయూ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన ప్రకారం... ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్కు చెందిన విద్యార్థిని, నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగు బైక్లపై ఆదివారం ములుగు జిల్లా వాజేడుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రింగ్ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వరకు చేరుకుని విశ్రాంతి కోసం కొద్దిసేపు ఆగారు. ఈ క్రమంలో వరంగల్కు చెందిన విద్యార్థినిని... ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్ అనే విద్యార్థి మాట్లాడే పనుందని చెప్పి... రింగ్ రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్పై పారిపోయాడు. మిగతా మిత్రులు బాధితురాలిని వరంగల్లో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్