Mulugu: మిత్రులతో కలిసి నమ్మి వచ్చినందుకు కాటేశాడు!

హనుమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఏడుగురు మిత్రులు కలిసి ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా పర్యటనకు వెళ్లారు.

Published : 04 Jul 2023 08:00 IST

డిగ్రీ విద్యార్థినిపై విద్యార్థి అత్యాచారం

భీమారం, న్యూస్‌టుడే: హనుమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఏడుగురు మిత్రులు కలిసి ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా పర్యటనకు వెళ్లారు. అందులోని ఓ విద్యార్థినిపై కన్నేసిన విద్యార్థి... తిరుగు ప్రయాణంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై సోమవారం కేయూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన ప్రకారం... ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్‌కు చెందిన విద్యార్థిని, నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగు బైక్‌లపై ఆదివారం ములుగు జిల్లా వాజేడుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రింగ్‌ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వరకు చేరుకుని విశ్రాంతి కోసం కొద్దిసేపు ఆగారు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన విద్యార్థినిని... ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్‌ అనే విద్యార్థి మాట్లాడే పనుందని చెప్పి... రింగ్‌ రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్‌పై పారిపోయాడు. మిగతా మిత్రులు బాధితురాలిని వరంగల్‌లో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని