Crime news: బాలికపై ఘోరం.. నాన్నే నరరూప రాక్షసుడయ్యాడు!

కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి మానవ మృగంలా మారాడు. తల్లి లేని ఆ చిన్నారి ఆలనా పాలనా చూడాల్సిన.....

Published : 08 Jun 2022 02:05 IST

కన్నౌజ్‌: కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మానవ మృగంలా మారాడు. తల్లిలేని ఆ పసిపాప ఆలనా పాలనా చూడాల్సిన వాడే ఆ బంగారు తల్లి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. వావివరసలు మరిచి అభం శుభం తెలియని ఆ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో గురుసహాయ్‌గంజ్‌ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి బాలిక తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక ఏడుపు విన్న ఆమె అత్త కేకలు వేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు గురుసహాయ్‌గంజ్‌  పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి రాజ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. పదేళ్ల క్రితమే బాలిక తల్లి చనిపోగా.. అప్పట్నుంచి అదృశ్యమైన నిందితుడు నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని