తాడేపల్లి రైల్వే ట్రాక్‌పై అత్యాచార నిందితుడు ప్రత్యక్షం

సంచలం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ప్రత్యక్షమయ్యాడు. తాడేపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద నిందితుడు కనిపించడంతో స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో

Updated : 24 Jun 2021 11:26 IST

అమరావతి: సంచలం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ప్రత్యక్షమయ్యాడు. తాడేపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద నిందితుడు కనిపించడంతో స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో నిందితుడు గూడ్స్‌ రైలు ఎక్కి పరారైనట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు రైల్వే ట్రాక్‌, రైల్వే యార్డ్‌ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రైల్వే వంతెనను నివాసంగా చేసుకొని నిందితుడు ఉంటున్నట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా నిందితుడు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు.

గుంటూరు జిల్లా  తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద  ఈ నెల 19న కాబోయే భర్తతో నదీతీరానికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాబోయే భర్త కాళ్లు చేతులు కట్టేసి.. చంపుతామని బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, చెవి దిద్దులు లాక్కెల్లారు. దీంతో ఈ ఘటన పెను సంచలనమైంది. పోలీసులు నిందితుల కోసం భారీ ఎత్తున గాలింపు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని