భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త

భర్త భార్యను బ్లేడుతో కోసి హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధిలో నివాసం ఉండే మల్యాద్రి, అనురాధ(30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకింది. దీంతో..

Published : 08 May 2021 01:18 IST

కావలి పట్టణం: భర్త భార్యను బ్లేడుతో కోసి హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధిలో నివాసం ఉండే మల్యాద్రి, అనురాధ(30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకింది. దీంతో వారి పిల్లల్ని బంధువుల వద్దకు పంపి వారు ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అనురాధకు ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. 108, 104 వాహనాలకు సమాచారం అందించినా వాళ్లు రాలేదు. స్థానిక అధికారులకు తెలిపినా వాళ్లు స్పందించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

మద్యం సేవించిన మల్యాద్రి భార్య అనురాధపై ఇంట్లో ఉన్న బ్లేడుతో మణికట్టుపై విచక్షణారహితంగా కోశాడు. అనంతరం తాను కూడా ఎడమ చేతి మణికట్టుపై కొంత మేర కోసుకొని బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి చూడగా అప్పటికే అనురాధ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని