Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
మధ్యప్రదేశ్లో కొందరు దుండగులు యువ విలేకరిపై అమానుషంగా ప్రవర్తించారు. చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు.
భోపాల్: ఓ యువ జర్నలిస్టు (Journalist)పై కొందరు దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. చెట్టుకు కట్టేసి.. విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ యాదవ్ అనే జర్నలిస్టు స్థానిక ఓ టీవీ ఛానల్లో పని చేస్తున్నారు. ఈ నెల 25న విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి అతడిని అడ్డగించి, జనవరి 1న జరిగిన ఓ సంఘటన గురించి వాదనకు దిగాడు. ఈలోగా అక్కడికి చేరుకున్న నరేంద్ర యాదవ్ అనే మరో వ్యక్తి జర్నలిస్టును దుర్భాషలాడారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈలోగా అక్కడికి చేరిన మరికొందరు ఆయన్ను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
keerthy suresh: ‘దసరా’ కోసం ఐదురోజులు డబ్బింగ్ చెప్పా: కీర్తిసురేశ్
-
Crime News
ఘోరం: హోంవర్క్ చేయలేదని చితకబాదిన టీచర్.. ఏడేళ్ల బాలుడి మృతి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
World Boxing Championship: ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్షిప్.. భారత్కు మరో స్వర్ణం
-
World News
America: టోర్నడోల విధ్వంసం.. 23 మంది మృతి..!
-
Sports News
Dhoni - Raina: అప్పుడు ధోనీ రోటీ, బటర్చికెన్ తింటున్నాడు..కానీ మ్యాచ్లో ఏమైందంటే: సురేశ్రైనా