Crime News: పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ మహిళ తానూ ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో.......

Updated : 04 Aug 2021 05:11 IST

(ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి)

కామారెడ్డి: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమర్యాగడి తండాకు చెందిన బానోత్ గోవింద్, హన్సి దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. గత కొన్నాళ్లుగా దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శీతల పానీయంలో పురుగుల మందు కలిపిన హన్సీ.. తన ఇద్దరు కుమార్తెలకు ఇచ్చింది. కుమారుడికి తాగించేందుకు యత్నించగా బాలుడు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. అనంతరం, హన్సీ తానూ పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చిన్నారుల కేకలు వినబడటంతో స్థానికులు వారిని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే హన్సీ మృతిచెందగా.. పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని