Andhra News: రూ.150కి లీటర్‌ పెట్రోల్‌ కూడా రాలేదంటే.. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు!

పెట్రోల్‌ తక్కువగా వచ్చిందని ప్రశ్నించిన ద్విచక్ర వాహనదారుడిపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.

Updated : 25 Apr 2022 05:45 IST

రామవరప్పాడు: పెట్రోల్‌ తక్కువగా వచ్చిందని ప్రశ్నించిన ద్విచక్ర వాహనదారుడిపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద చోటుచేసుకుంది. గుణదల ప్రాంతానికి చెందిన వర్మ.. బంక్‌లో రూ.150 ఇచ్చి పెట్రోల్‌ పోయించాడు. పెట్రోల్‌ తక్కువగా వచ్చిందని.. రూ.150కి లీటర్‌ కూడా రాలేదంటూ బంక్‌ సిబ్బందిని ఆయన ప్రశ్నించాడు. దీంతో సిబ్బంది మూకుమ్మడిగా వర్మపై దాడి చేశారు. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత సపర్యలు చేయడంతో మళ్లీ స్పృహలోకి వచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని