శంషాబాద్‌లో లారీ బోల్తా: ఆరుగురి మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా..

Updated : 27 Dec 2022 17:45 IST

శంషాబాద్‌: హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. సుల్తాన్‌పల్లి ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు.. కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనేందుకు శంషాబాద్‌ మార్కెట్‌కు లారీలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో కళాకుమార్ సునా (20), కృపా సునా (25), గోపాల్‌ దీప్‌ (25), బుదన్‌ (25), హస్తా యాదవ్‌ (55)తో పాటు మరొకరు ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 50మంది కూలీలు ఉన్నారు. వీరందర్నీ ఒడిశాలోని బలంగిర్‌ జిల్లా డాబుగా బ్లాక్ చికిలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తాపడటంతో చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం జేసీబీ సాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని