Andhra News: వివాహానికి వెళ్తుండగా ప్రమాదం.. పెళ్లి బృందంలో నలుగురి మృతి

పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. వివాహానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో చోటు చేసుకుంది. అవనిగడ్డ డీఎస్పీ

Updated : 26 May 2022 17:32 IST

మోపిదేవి: పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. వివాహానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో చోటు చేసుకుంది. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామానికి చెందిన పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెదప్రోలులో జరిగే వివాహానికి ఆటోలో బయలు దేరారు. చల్లపల్లి జాతీయ రహదారి 216 కాశా నగర్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో కిందపడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నారు. ఘటనలో గాయపడిన మరో ఏడుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని