న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. వ్యక్తి అరెస్టు
న్యాయమూర్తులపై అబాండాలు వేస్తూ... వారి తీర్పులను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై కడప పట్టణానికి..
అమరావతి: న్యాయమూర్తులపై అబాండాలు వేస్తూ... వారి తీర్పులను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై కడప పట్టణానికి చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ, ఏసీబీ (విశాఖ) విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులపై ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్లలో అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టడం, వారి తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో ఏపీ హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించింది. విచారణను సీబీఐకు అప్పగించింది.
ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల మేరకు ఏపీ సీఐడీ(సైబర్ క్రైం) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీబీఐ, ఏసీబీ విశాఖ విభాగం డీఎస్పీ, కేసు విచారణాధికారి సంజయ్ కుమార్... నిందితుడు రాజశేఖర్ రెడ్డిని శుక్రవారం కడపలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐపీసీ సెక్షన్లు 153ఏ, 504, 505, ఐటీ యాక్ట్ 67 ప్రకారం 16 మంది ప్రైవేటు వ్యక్తులతోపాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులపై 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీరిలో రాజశేఖర్ రెడ్డిని 15వ నిందితుడిగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. రాజశేఖర్ రెడ్డి కువైట్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడ నుంచే సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టింగ్లు పెడుతున్నట్లు సీబీఐ గుర్తించింది. అతనిపై నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం కడపకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. తిరిగి కువైట్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుసుకుని అతని పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
న్యాయమూర్తుల తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, వారికి దురుద్దేశాలు ఆపాదించటం, అసభ్యంగా మాట్లాడి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారనే నేరారోపణలపై సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజశేఖర్రెడ్డిని ఇవాళ గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది వివరాలు నిందితుడికి తెలుసునని.. లోతైన దర్యాప్తు చేయాల్సి ఉన్నందున నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఈనెల 12కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం