మహిళల బాత్రూమ్లో కెమెరా.. ఆ ఫోన్లో సిమ్ కార్డ్ లేదట
జూబ్లీహిల్స్లోని వన్డ్రైవ్ ఫుడ్ కోర్టులో మహిళల బాత్రూమ్లో సెల్ఫోన్తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ..
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని వన్డ్రైవ్ ఫుడ్ కోర్టులో మహిళల బాత్రూమ్లో సెల్ఫోన్తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాత్రూమ్ క్లీనర్గా పని చేసే బాలుడు ఫోన్ కెమెరా అమర్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ‘‘ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మైనర్. మరో రెండు వారాలు గడిస్తే మైనారిటీ తీరుతుంది. నిందితుడు ఆరు నెలల క్రితమే పనిలో చేరాడు. వారం రోజుల క్రితమే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. బాత్రూమ్లో వీడియో చిత్రీకరించే సమయంలో ఫోన్లో సిమ్ కార్డ్ లేదు. తన ఫోన్ నుంచి ఎవరికీ ఆ వీడియోలు పంపినట్లు మేం గుర్తించలేదు. హోటల్ యజమాని, సెక్షన్ ఇంఛార్జ్ని విచారిస్తున్నాం. అక్కడి సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నాం. తమ ఫుటేజ్ ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు బాధితులు ఎవరూ ఇంతవరకు స్టేషన్కు రాలేదు. ఇప్పటివరకు ఒక్కడే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు కేశవ్ అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఈ విషయంలో అతని ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నాం. బాలుడు ఒక్కడే చేశాడా? లేదా ఎవరి ప్రోద్బలంతోనైనా చేశాడా? అనే విషయాలను తెలుసుకుంటాం. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు తరలిస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వన్ డ్రైవ్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేస్తాం’’ అని సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు.
ఘటనపై ఫుడ్కోర్టు యజమాని చైతన్య స్పందిస్తూ.. ‘‘ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న కేశవ్ను పోలీసులు విచారించాలి. అతను మా దగ్గర నుంచి డబ్బు గుంజాలని ప్రయత్నించాడు. రూ.15 లక్షలిస్తే ఈ వ్యవహారాన్ని సెటిల్ చేస్తానని కేశవ్ చెప్పాడు. ఘటనపై మేమే పోలీసులకు చెబుతామని అన్నాం’’ అని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్లోని వన్డ్రైవ్ ఫుడ్ కోర్టులోని మహిళల బాత్రూమ్లో సెల్ఫోన్తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది. బాత్రూమ్లో కెమెరా ఆన్చేసిన సెల్ఫోన్ను ఓ యువతి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిన్నంతా ఫోన్ కెమెరా ఆన్లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాత్రూమ్ క్లీనర్గా పని చేసే బాలుడు ఫోన్ కెమెరా అమర్చినట్టు దర్యాప్తులో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM