Crime news: ఒంటరి మహిళలను అంతం చేసే ఇద్దరు నిందితులు అరెస్టు
బెజవాడలో కరుడుగట్టిన ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడుతోన్న ఇద్దరు
విజయవాడ: బెజవాడలో కరుడుగట్టిన ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. నున్న పోలీసుస్టేషన్ పరిధిలోని కుందావారి కండ్రిక వద్ద గత నెల 26న మున్నంగి సుబ్బమ్మ (75)ను గుర్తు తెలియని వ్యక్తి కిరాతకంగా కొట్టి గాయపరచి.. ఆమె మెడలోని బంగారు ఆభరణాలను అపహరించాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించగా ద్విచక్ర వాహనంపై వాంబే కాలనీకి చెందిన పల్లె రాము అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. కేదారేశ్వరిపేటకు చెందిన అతని స్నేహితుడు నాగరాజుతో కలిసి మూడు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు రాము గతంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. రైలు ప్రమాదంలో తన కుడికాలుకు గాయమై కాలు కింది భాగాన్ని తొలగించారు. దీంతో కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. తనకున్న చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు తేలికగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుని నేరాలు చేయడం ప్రారంభించాడని సీపీ తెలిపారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలతో పరిచయం పెంచుకుని బంగారు ఆభరణాలను దొంగలించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాయకాపురం ప్రాంతంలో సత్యవతి (80) అనే మహిళ ఇంట్లోనూ ఇదే తరహా దొంగతనం చేశాడని.. ఆమెను బలంగా నెట్టేయడంతో తలకు గాయమై చనిపోయిందని వివరించారు. మార్చి 27న అజిత్సింగ్ నగర్లో వెంకాయమ్మ (75) దగ్గరకు అద్దె ఇల్లు కావాలని వెళ్లి బంగారు అభరణాలు దొంగిలించినట్లు సీపీ వెల్లడించారు. ఈ మూడు నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.