Andhra News: విజయనగరంలో కన్నతల్లి సాక్షిగా చిన్నారికి చిత్రహింసలు

విజయనగరం జిల్లా కొత్తపేట పరిధిలోని శాలువపేటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నా అనే వ్యక్తి రెండేళ్ల చిన్నారిని కొరికి తీవ్రంగా గాయపరిచాడు. గత ఏడు నెలల వ్యవధిలో...

Published : 18 Feb 2022 01:09 IST

విజయనగరం (రింగు రోడ్డు): విజయనగరం జిల్లా కొత్తపేట పరిధిలోని శాలువపేటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నా అనే వ్యక్తి రెండేళ్ల చిన్నారిని కొరికి తీవ్రంగా గాయపరిచాడు. గత ఏడు నెలల వ్యవధిలో అనేకసార్లు పలు రకాలుగా చిన్నారిని గాయపరిచాడు. చిన్నారి ఒంటిపై గాయాలు చూసిన అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న నిందితుడు చిన్నా.. చిన్నారి తల్లి నాగమణితో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చిన్నారిపై వేధింపులకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు చిన్నా చిన్నారిని హత్య చేసేందుకు ప్రయత్నించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని