Hyderabad: నాగోలులో కాల్పుల కలకలం.. బంగారం దుకాణంలో దోపిడీ

ఎల్బీనగర్‌ పరిధిలోని నాగోలు స్నేహపురి కాలనీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మహదేవ్‌ జువెల్లర్స్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు  ఒక్కసారిగా దుకాణం యజమానిపై కాల్పులకు తెగబడ్డారు.

Updated : 01 Dec 2022 22:25 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ పరిధిలోని నాగోలు స్నేహపురి కాలనీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మహదేవ్‌ జువెల్లర్స్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దుకాణం యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో దుకాణం యజమాని కల్యాణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం దుండగులు షాపులోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గాయపడిన కల్యాణ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని