Wordle: పదవినోదం.. ఆమె ప్రాణాలు కాపాడింది!
పదవినోదం ఆడితే కాలక్షేపం అవడమే కాదు.. మెదడుకు పదును పెట్టి.. తెలివితేటలు పెంచుతుంది. అయితే, ఇదే ఆట ఓ వృద్ధురాలి ప్రాణాల్ని
వాషింగ్టన్: పదవినోదం ఆడితే కాలక్షేపం అవడమే కాదు.. మెదడుకు పదును పెట్టి.. తెలివితేటలు పెంచుతుంది. అయితే, ఇదే ఆట ఓ వృద్ధురాలి ప్రాణాల్ని సైతం కాపాడింది. ఒక దుండగుడి చెర నుంచి రక్షించింది. ఎలాగంటారా? అయితే ఇది చదవండి..
పదవినోదానికి సంబంధించి రకరకాల గేమ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ‘వర్డిల్’ అనే గేమ్ యాప్ అంతర్జాతీయంగా పాపులరైంది. ఇందులో కొన్ని ఆంగ్ల అక్షరాలను ఇచ్చి వాటిల్లో ఐదు అక్షరాల ఒక పదాన్ని ఆరు ప్రయత్నాల్లో కనుగొనాలి. ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో కనుగొంటే అంత ఎక్కువ స్కోరు లభిస్తుంది. అయితే, చికాగోకి చెందిన 80ఏళ్ల డెన్సె హోల్ట్ ఈ ఆటకు అలవాటు పడింది. ఒంటరిగా జీవిస్తున్న ఆమె.. ప్రతి రోజు రాత్రి ఈ గేమ్ ఆడి సాధించిన స్కోరును సియాటిల్లో ఉన్న తన పెద్ద కుమార్తె మెరెడిత్ హోల్ట్ కాల్డ్వెల్కి పంపిస్తుంటుంది. అయితే, ఫిబ్రవరి 5న ఒక దుండగుడు హోల్ట్ ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో బెదిరించి ఆమెను సెల్లార్లో బందించాడు. దీంతో ఆ రాత్రి ‘వర్డిల్’ గేమ్ ఆడి స్కోరును తన కుమార్తెకి పంపించలేకపోయింది. దీంతో కాల్డ్వెల్కు అనుమానం వచ్చి చికాగో పోలీసులకు సమాచారం ఇచ్చింది.
మరుసటి రోజు ఉదయం పోలీసులు హోల్ట్ ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తుండగా.. దుండగుడు ఎదురుపడ్డాడు. కొన్ని గంటలపాటు శ్రమించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సెల్లార్లో బందిగా ఉన్న హోల్ట్ను రక్షించారు. దుండగుడిని 32ఏళ్ల జేమ్స్ డేవిస్గా గుర్తించిన పోలీసులు అతడికి మతిస్థిమితం లేనట్లు భావిస్తున్నారు. కిటికీ అద్దాలు బద్దలుకొట్టుకొని ఇంట్లోకి వచ్చిన దుండగుడు తనని బెదరించాడని, ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని హోల్ట్ చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం