రూ.‘కోటి’.. చీకటి పాలు
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది.
లారీలు ఢీకొని ధ్వంసమవుతున్న సెంట్రల్ లైటింగ్ స్తంభాలు
కాగజ్నగర్, న్యూస్టుడే
ఫారెస్టు ఆఫీసు సమీపంలో వంగిపోయిన సెంట్రల్ లైటింగ్ స్తంభం
- ఎన్టీఆర్, లారీ చౌరస్తా క్రాసింగ్ల వద్ద ఓవర్లోడ్తో వస్తున్న లారీల నుంచి కర్రలు కింద పడిపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో ఓ లారీలోని కర్రలు సమీపంలోని ద్విచక్రవాహనదారుడిపై పడి అతను గాయపడ్డాడు.
- 2000-02 లో రూ.1.50 కోట్ల వ్యయంతో కాగజ్నగర్ పురపాలిక పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి రైల్వేగేటు వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో నాసిరకంగా విద్యుత్తు స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయడంతో.. బిగించిన ఏడాదికే లైట్లు ఊడిపోయాయి. మరికొన్ని లారీలు తగిలి వంగిపోయాయి. ఇటీవలే పాత స్తంభాలను తొలగించి, కొత్తవి బిగించినప్పటికీ మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. గతేడాది కాగజ్నగర్ పురపాలిక పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా(పెట్రోల్పంపు) నుంచి రాజీవ్గాంధీ చౌరస్తా వరకు రూ.కోటి వ్యయంతో సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. రహదారి విస్తరణ లేక నిర్మాణాలు చేపట్టడంతో అనతికాలంలోనే ఆ స్తంభాలు ధ్వంసమవుతున్నాయి. ఆ రహదారికి ఇరువైపులా ఎస్పీఎం క్వార్టర్లు ఉన్నాయి. వాటిని తొలగించి రహదారి విస్తరణకు అప్పట్లో మిల్లు యాజమాన్యం నిరాకరించింది. దాదాపు 60 ఫీట్ల వెడల్పులో సెంట్రల్ లైటింగ్ విద్యుత్తు స్తంభాలు నిర్మించాలి. కానీ 45 నుంచి 50 ఫీట్లు వెడల్పు మాత్రమే ఉంది. ఆ రహదారిలోనే డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేపట్టారు.
ప్రస్తుతం మిల్లుకు వివిధ రాష్ట్రాల నుంచి 10, 12 టైర్ల లారీలు ఓవర్ లోడ్(కర్ర)తో రాకపోకలు సాగిస్తుంటాయి. ఓవర్ లోడ్ కర్ర ఈ స్తంభాలకు తగలడంతో విద్యుత్తు దీపాలు ఊడిపోతున్నాయి. మరి కొన్ని వంగిపోతున్నారు. వారం రోజుల కిందట ఓ లారీ ఢీకొనగా.. ఒక స్తంభం వంగిపోయింది. మళ్లీ అదేరోజు సాయంత్రం మరో స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో ఓ ఆటో, ద్విచక్ర వాహనదారుడిపై పడటంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఏడాదిల్లోపు 8 సెంట్రల్ లైటింగ్ స్తంభాలు వంగిపోగా.. మరో నాలుగు దీపాలు ఊడిపోయాయి. సత్వరమే రహదారిని విస్తరించి, సెంట్రల్ లైటింగ్కు లోడ్ లారీలు తగలకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
ఓవర్ లోడ్తో వస్తున్న ముడిసరకు లారీ
భారీ వాహనాలను నిషేధించాలి
ఎన్టీఆర్ చౌరస్తా నుంచి రాజీవ్గాంధీ చౌరస్తా వరకు రహదారి ఇరుకుగా ఉంది. ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో మిల్లుకు నిత్యం లోడ్ లారీలను ఎన్టీఆర్ చౌరస్తా నుంచి సర్సిల్క్ ప్రధాన రహదారి గుండా లోపలికి అనుమతించాలి. బల్దియా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగాలి: అంజయ్య, కమిషనర్
ఎస్పీఎంకు నిత్యం వచ్చే లోడ్ లారీల వల్లే పురపాలిక సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు తగిలి వంగిపోతున్నాయి. సత్వరమే ఈ రహదారి గుండా కాకుండా మరో రహదారి నుంచి ముడిసరకు లారీలు వచ్చే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామన్నారు. సెంట్రల్ లైటింగ్ స్తంభాలను ఢీకొన్న లారీలపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
[ 27-04-2024]
మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీం బాధ్యురాలు బి.సుశీల సూచించారు. -
అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
[ 27-04-2024]
స్థానిక సుదరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సబిత ముఖ్యఅధితిగా హజరై, పిల్లలకు అభివృద్ధి పత్రాలు అందించారు. -
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే