గురుకుల్లాల్లో చదువుకుందాం రారండి!
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో అయిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.
భీమునిపట్నం, న్యూస్టుడే
భీమిలి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో అయిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఆన్లైన్లో రూ.50 దరఖాస్తు రుసుం చెల్లించి ఏపీఆర్ఎస్.ఏపీసీిఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్సైట్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలి. సీట్లు లభించిన విద్యార్థులకు పదోతరగతి వరకు పాఠశాల, హాస్టల్ వసతి ఒకేచోట కల్పిస్తూ ఉచిత విద్యను అందించి ప్రోత్సహిస్తారు. తర్వాత జరిగే ఆంధ్రప్రదేశ్ గరుకుల జూనియర్ కళాశాల(ఏపీఆర్జేసీ) ఎంట్రన్స్లో సీట్లు లభిస్తే వరుసగా రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్య కూడా కొనసాగించేందుకు అవకాశం లభిస్తుంది.
ప్రవేశాల కోసం అర్హతలు
* ప్రభుత్వ గుర్తింపు కల్గిన పాఠశాలలో 2020-2021లో మూడో తరగతి, 2021-2022లో నాలుగో తరగతి చదివి ఉండాలి.
* ఇందులో ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.ే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుంచి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.
* ఓసీ, బీసీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చదివి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ అర్హులుగా పరిగణిస్తారు.
* విద్యార్థి తల్లిదండ్రులతోపాటు సంరక్షకుల వార్షికాదాయం (2021-2022) రూ.లక్షకు మించి ఉండరాదు
* ఇందులో తెల్లరేషన్ కార్డుదారులకు, సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని గురుకులాలు
* భీమునిపట్నం(బాలికలు) * అచ్యుతాపురం(బాలికలు) * నర్సీపట్నం(బాలురు)
సంప్రదించాల్సిన చరవాణి సంఖ్యలు
98665 59618, 94410 23972
లాటరీ పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక
గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులకు సంబంధించి జూన్ 10వ తేదీన లాటరీ నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఎంపికయిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తాం. గురుకులాల్లో క్రమశిక్షణతో కూడిన విద్య లభించడంతోపాటు జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోటానికి మార్గం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలతో దరఖాస్తు చేయించాలని కోరుతున్నాం.
-కోడి రాంబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ ప్రధానాచార్యులు, ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, భీమునిపట్నం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్