పంచాయతీకి కోటిన్నర వెచ్చించాం
గత మూడేళ్లలో ఒక్కో పంచాయతీలో ప్రభుత్వం కనీసం రూ. 1.5 కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేసిందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు.
లబ్ధిదారుకు బియ్యం అందజేస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: గత మూడేళ్లలో ఒక్కో పంచాయతీలో ప్రభుత్వం కనీసం రూ. 1.5 కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేసిందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. చొంపి పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సంక్షేమ పథకాలను వివరించి లబ్ధిదారులకు అందుతున్నాయో లేదా అని ఆరా తీశారు. చొంపిలో సంచార వాహనం వద్ద లబ్ధిదారులకు బియ్యం తూచి అందజేశారు. సర్పంచి సుభద్ర, ఎంపీపీ ఉషారాణి, ఎంపీడీఓ వెంకటేష్, ఎంఈఓ భారతీరత్నం, వార్డు సభ్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ, న్యూస్టుడే: గిరిజన ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఊతమిస్తోందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. కురిడి పంచాయతీ శరత్నగర్లో శనివారం ఆయన పర్యటించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్గాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని చెప్పారు. జడ్పీటీసీ సభ్యులు బొంజుబాబు, వైకాపా సీనియర్ నాయకులు సింహాచలం, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. -
జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కృషి
[ 10-05-2024]
గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్. -
అప్పన్న నిజరూపం.. నేడే సాక్షాత్కారం
[ 10-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం శుక్రవారం సాక్షాత్కారం కానుంది. ఆలయంలో ఒంటి గంటకే అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. -
అటవీ హక్కుల చట్టానికి కేంద్రం తూట్లు: సీతారాం ఏచూరి
[ 10-05-2024]
దేశంలో లౌకికవాదం బతకాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. -
గోదావరిలో పడి విద్యార్థి మృతి
[ 10-05-2024]
ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. మండలంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి తీరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ కేటగిరీల అధికారులు, సిబ్బందితో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురువారంతో ముగిసింది. -
ఇసుక అక్రమాలు ఇన్నిన్ని కావయా!
[ 10-05-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతంలో ఉచితంగా లభించిన ఇసుక వైకాపా హయాంలో ప్రియమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!