అసత్యాల సారథి.. ఏదీ వారధి?
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్.
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్.
ఆ ఒడ్డు, ఈ ఒడ్డు.. నడిమధ్య ఏరు అడ్డు..
దాటేందుకు వంతెనల్లేక చుట్టూ తిరిగి రావడం..
నీళ్లలో దిగి బిక్కుబిక్కుమంటూ దాటడం..
ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి రావడం..
దీనిని మంచి చేయడం అనాలా.. నట్టేట్లో ముంచడం అనాలా జగన్?
వర్షాలొస్తే వణుకే!
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే
బీఎన్ రహదారిలో విజయరామరాజుపేట దగ్గర కూలిన వంతెన
మార్గం : భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్) రహదారి
ప్రాంతం : బుచ్చెయ్యపేట మండలం వడ్డాది-చోడవరం మధ్యలో విజయరామరాజుపేట దగ్గర తాచేరుపై వంతెన గతేడాది డిసెంబరు 20న కూలిపోయింది.
పరిస్థితి : పాడేరు, మాడుగుల, వడ్డాది నుంచి వాహనాలు చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం వైపు వెళ్లాలంటే ఇక్కడ వంతెన మీదగానే ప్రయాణించాలి. ఇది కాస్తా కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అంతా పూర్తిగా స్తంభించింది. ప్రయాణికులందరూ నానాకష్టాలు పడ్డారు.
పాలకులు చేసిందేంటి : కూలిపోయిన వంతెన స్థానంలో మళ్లింపు రోడ్డు నిర్మించారు. తాచేరులో గొట్టాలు పరిచి పైన మట్టి వేసి వదిలేశారు. వర్షాకాలం వస్తే ఈ రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించే ప్రమాదం ఉంది. కొత్తవంతెన నిర్మాణం దిశగా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ప్రతిపాదనలతో సరి!
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే
మార్గం : భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్) రహదారి
వంతెన : బుచ్చెయ్యపేట మండలం వడ్డాది దగ్గర
పెద్దేరుపై.. 2022 మే నెలలో కూలిపోయింది.
పరిస్థితి : అనకాపల్లి జిల్లా, మన్యాన్ని కలిపే మార్గంలో వంతెన ఇది. నిర్వహణ, మరమ్మతులు లేకపోవడం, ఇసుక తవ్వకాలు, అధిక బరువుతో కూడిన గ్రానైటు లారీలు తిరగడంతో కూలిపోయింది. సుమారు నెలరోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
పాలకులు చేసిందేంటి : పక్కన రూ. కోటి వ్యయంతో కాజ్వే నిర్మాణం చేపట్టారు. దీన్ని తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల తరచూ ముంపు బారిన పడుతోంది. పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి అధికారులు రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించినా ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించలేదు. భారీ వర్షాలు పడితే రాకపోకలు నిలిచిపోతాయి.
చేతకాక చేతులెత్తేశారు
కోటవురట్ల, న్యూస్టుడే
జల్లూరు వద్ద అసంపూర్తిగా..
మార్గం : కోటవురట్ల మండలం నర్సీపట్నం-అడ్డురోడ్డు
ప్రాంతం : జల్లూరు వద్ద
వరాహా నదిపై పరిస్థితి : బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉండటంతో, తెదేపా హయాంలో రూ. 6 కోట్లు మంజూరు చేసి, సుమారు 90 శాతం పనులను పూర్తిచేశారు. ఇంకా కేవలం రెండువైపులా అప్రోచ్ పనులే మిగిలాయి.
పాలకులు చేసిందేంటి : అయిదేళ్ల కాలంలో వైకాపా పాలకులు 10 శాతం పనులు చేయలేక చతికిలపడ్డారు. మరోసారి అధికారంలోకి వస్తే పనులు పూర్తి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు.
నెరవేరని నేతల హామీ
కొయ్యూరు, న్యూస్టుడే
మార్గం : కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ వీరవరం-గొట్టెలపాడు
వంతెన : గొట్టెలపాడు సమీపంలోని బూడిదగెడ్డ
పరిస్థితి : యు.చీడిపాలెం, ఉల్లిగుంట, ఎర్రగొండ, మర్రిపాకలు తదితర గ్రామాలకు ఇదే మార్గం. వర్షాలు పడితే బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.
పాలకులు చేసిందేంటి : బూడిదగెడ్డతోపాటు ఈదులబంద, పలకజీడి సమీపంలో వంతెనల నిర్మాణానికి మూడున్నరేేళ్ల కిందట ఆయా గ్రామాల గిరిజనులకు వంతెన నిర్మిస్తామని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హామీ ఇచ్చారు. ఈదులబంద, బూడిదగెడ్డ దగ్గర వంతెన నిర్మాణాలకు ఒక్కోదానికి సుమారు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. కనీసం ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
అసంపూర్తి వంతెనతో అవస్థలు
మార్గం : చిలకలగెడ్డ-జీలుగులపాడు
ప్రాంతం : జీలుగులపాడు వద్ద గోస్తనీ నదిపై..
పరిస్థితి : అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సుమారు 30 గ్రామాల ప్రజల రాకపోకలకు ప్రస్తుతం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. స్థానికులే చందాలు వేసుకుని మట్టి వేసుకుని ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు కాస్త ఏర్పాటు చేసుకున్నారు. అత్యవసర సమయాల్లో కనీసం 108 వాహనం రాలేని పరిస్థితి ఉంది.
అనంతగిరి, న్యూస్టుడే
పాలకులు చేసిందేంటి? : వంతెన నిర్మాణం కోసం సుమారు రూ. 2 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా ప్రకటించింది. పనులు ప్రారంభించిన గుత్తేదారు ఆరు శ్లాబ్లు వేయాల్సి ఉంది. ఐదు శ్లాబ్లు వేశాక నిధులు చాలలేదని పనులు మధ్యలో ఆపేశారు.
కుంబిడిసింగి వెళ్లాలంటే కష్టాలే!
శ్రమదానంతో రాళ్ల వారధి నిర్మించుకుంటున్న గిరిజనులు
మార్గం : జి.మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్ నుంచి కుంబిడిసింగి
ప్రాంతం : కుంబిడిసింగిలోని మత్స్యగెడ్డ
పరిస్థితి : భారీ వర్షాలు వచ్చినప్పుడు జనజీవనం స్తంభించి పోతుంది. అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంచాయతీ ప్రజలే ఏకమై తాత్కాలికంగా రాళ్లను పేర్చి దానిపై కంకర వేసి రాకపోకలు సాగిస్తున్నారు.
పాలకులు చేసిందేంటి? : పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ పంచాయతీలో పర్యటించి గెడ్డను పరిశీలించారు. బ్రిడ్జిని నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇచ్చిన హామీ అమలు కాలేదు.
జి.మాడుగుల, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని