జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కృషి
గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు.
మాట్లాడుతున్న రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు,
చిత్రంలో కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, దొన్నుదొర తదితరులు
అరకులోయ, న్యూస్టుడే: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. అరకులోయ అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు గురువారం ఆయన అరకులోయ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత యువతకు గుండెకాయలాంటి జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రివ్యూ పిటిషన్ వేయాల్సిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ జీవో రద్దుకు సీపీఎం సహకరించి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ప్రజల ఆశలను వైకాపా ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు దారి మళ్లించిందని చెప్పారు. జిల్లాల విభజన అనంతరం అరకును జోన్ 2లో చేర్చారని పేర్కొన్నారు. దీని కారణంగా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరకు జోన్ని మార్పు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మన్యం అభివృద్ధికి, ఆదివాసీల సంక్షేమానికి ప్రధాని మోదీ అనేక పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతలను గెలిపించాలని కోరారు. అరకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నాయకులు దొన్నుదొర, దాసుబాబు, శెట్టి బాబూరావు, భాజపా నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ