ఇసుక అక్రమాలు ఇన్నిన్ని కావయా!
తెదేపా ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతంలో ఉచితంగా లభించిన ఇసుక వైకాపా హయాంలో ప్రియమైంది.
తెదేపా పాలనలో ఉచితంగా లభ్యం
వైకాపా హయాంలో రెట్టింపు ధర
పెదబయలు, న్యూస్టుడే
తెదేపా ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతంలో ఉచితంగా లభించిన ఇసుక వైకాపా హయాంలో ప్రియమైంది. కొత్త ఇసుక విధానమంటూ రెట్టింపు ధరలు వసూలు చేసి ప్రజల నడ్డి విరిచారు. దీంతో ఏజెన్సీలోనే అతిపెద్ద ఇసుక క్వారీల్లో ఒకటైన మంగబంద క్వారీ అక్రమ తవ్వకాలకు నిలయంగా మారింది. అక్రమార్కులు కింది స్థాయి నుంచి పైస్థాయి నాయకుల వరకు మామూళ్లు ముట్టజెప్పినట్లు ఆరోపణలున్నాయి. నాలుగేళ్లపాటు అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏడాది క్రితం పంచాయతీలకు అనుమతుల పేరిట తాత్కాలిక రుసుం వసూలు చేయడంతో ధరలు మరింత అధికమయ్యాయి.
మంగబంద క్వారీలో ఇసుక తవ్వకాలు
వైకాపా ప్రభుత్వం మన్యంలో డిపోలు లేకుండా పారదర్శకంగా ఇసుక పంపిణీ చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఇది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఎక్కడా ఇసుమంత ఇసుక లభించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో పెదబయలు మండలంలోని మంగబంద క్వారీపై ప్రజాప్రతినిధుల కన్ను పడింది. అక్రమ తవ్వకాలకు ఇది నిలయంగా మారడం, కొంతమందికి మామూళ్లు అందకపోవడం, జిల్లాల పునర్విభనజన జరగడంతో వైకాపాలోనే ముసలం మొదలయింది. నాడు-నేడు మొదటి దశలో మైదాన ప్రాంతం ఇసుక వినియోగించడంతో ఖర్చు తడిసిమోపెడైంది. గత్యంతరం లేక ఇక్కడ ఇసుకనే ఆ పనులకు వినియోగించారు. డిమాండ్ పెరగడంతో అక్రమ తవ్వకాల జోరందుకున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్కు వైకాపా నాయకులే ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం కొరత ఏర్పడడంతో జిల్లా కలెక్టర్, ఉప కలెక్టర్, సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోలు కలిసి ఎవరికీ ఇబ్బంది లేకుండా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులతో ఒకే బిల్లుతో రోజుకు రెండు, మూడు లోడ్లు తరలిస్తున్నారని, ప్రతి రోజూ వందల వాహనాల్లో లోడ్లు వెళుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులతోపాటు మధ్యవర్తులు, నాయకులు లాభాలు ఆర్జిస్తున్నారు. మన్యంలో ఎప్పుడూలేని విధంగా వైకాపా హయాంలో ఇసుక ఇక్కట్లు ఎదురయ్యాయని పలువురు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..