విషాదంగా ముగిసిన విహారయాత్ర
ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన యువకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది.
మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులో లోయలో పడిన లారీ
మారేడుమిల్లి, రంపచోడవరం, న్యూస్టుడే: ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన యువకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులో లారీ అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మారేడుమిల్లి సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఆరుగురు యువకులు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చారు. శుక్రవారం ఉదయం ఘాట్రోడ్డులోని అమృతధార జలపాతాన్ని సందర్శించారు. తిరిగి మారేడుమిల్లి వచ్చేందుకు రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ ఎక్కారు. మారేడుమిల్లి మండలం వాలమూరు వద్ద ప్రమాదకర మలుపులో లారీ లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో దర్శికి చెందిన పిచ్చాల నారాయణరెడ్డి (28), గుమ్మడి నాగసురేశ్ (23) ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లారీ డ్రైవర్ వెంకటేశ్వరస్వామితోపాటు దర్శికి చెందిన హర్షవర్ధన్రెడ్డి, సుబ్బారెడ్డి, చెన్నారెడ్డి గాయపడ్డారు.
అప్పటివరకు ఆనందంగా..
మన్యం అందాలు తిలకించేందుకు ఆరుగురు స్నేహితులు గురువారం ఉదయమే గోదావరి ఎక్స్ప్రెస్లో రాజమహేంద్రవరం వచ్చి అక్కడి నుంచి గండిపోశమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి బోటులో పాపికొండల విహారయాత్రకు వెళ్లి ఆనందంగా గడిపారు. సాయంత్రానికి మారేడుమిల్లి చేరుకుని ఇక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయమే మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులోని అమృతధార జలపాతం అందాలు తిలకించేందుకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడ గడిపిన తర్వాత తిరిగి మారేడుమిల్లికి లారీలో బయలుదేరారు. కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లారీ చెట్టుకు ఢీకొట్టడంతో అద్దాలు పగిలిపోయి నారాయణరెడ్డి రహదారిపై పడిపోగా, అతనిమీదుగా వాహనం వెళ్లిపోయింది. నాగసురేశ్ లారీతోపాటు లోయలో పడిపోయాడు. ఆయన మృతదేహాన్ని తీయడం కష్టతరంగా మారింది.
ఒకరు రైల్వే టీసీ.. మరొకరు ఎంసీఏ విద్యార్థి
మృతుల్లో ఒకరు రైల్వే టీసీ కాగా, మరొకరు ఎంసీఏ విద్యార్థి. నారాయణరెడ్డి క్రీడాకారుడి కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఒడిశాలో రైల్వే టీసీగా పనిచేస్తున్నారు. ఈ వేసవిలో ఈయనకు వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని స్నేహితులు తెలిపారు. నాగసురేశ్ ప్రస్తుతం ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మిగిలిన నలుగురు స్నేహితులు చిన్నచిన్న పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అతివేగమే కారణం
లారీ అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదకర మలుపుల్లోనూ వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పినట్లు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కాశిరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో చెట్టును ఢీకొట్టుకుంటూ లారీ లోయలోకి దూసుకుపోవడం గమనిస్తే వాహనం చాలా వేగంగా ప్రయాణించినట్లు అర్థమవుతోంది.
హుటాహుటిన సహాయక చర్యలు
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మారేడుమిల్లి పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీఐ అద్ధంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు ఎన్.రాము, డి.జ్వాలాసాగర్ సిబ్బందితో ప్రమాద ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్లో రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల