వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా.. నలుగురు గాయపడ్డారు. మారేడుమిల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు మృతి చెందాడు.
నలుగురికి గాయాలు
మారేడుమిల్లి, న్యూస్టుడే
శ్రీనివాసరెడ్డి మృతదేహం
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా.. నలుగురు గాయపడ్డారు. మారేడుమిల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు మృతి చెందాడు. మారేడుమిల్లి వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని మినీ వ్యాను ఢీ కొట్టడంతో ఇద్దరు గిరిజనులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తాడేపల్లి పంచాయతీ కొడవటిలంక గ్రామానికి చెందిన కత్తుల శ్రీనివాసరెడ్డి (32), డి.వెలమలకోట గ్రామానికి చెందిన తుంబుడు మంగిరెడ్డి మారేడుమిల్లిలో చదువుతున్న తమ పిల్లలను చూడడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన గిరిజనులను 108 అంబులెన్సులో తొలుత రంపచోడవరం తీసుకెళ్లారు. అక్కడి నుంచి కాకినాడ తరలించారు. చికిత్స పొందుతూ కత్తుల శ్రీనివాసరెడ్డి (32) మంగళవారం ఉదయం మృతి చెందాడని మారేడుమిల్లి ఎస్సై ఎన్.రాము తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గాయపడిన మరో గిరిజనుడి పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.
నుజ్జయిన ద్విచక్ర వాహనం
డ్రైవరుకు కళ్లు తిరిగి చెట్టుకు కారు ఢీ..
మృతి చెందిన చిదంబర్
చింతూరు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద మంగళవారం జరిగింది. ఒడిశాలోని కొరాపుట్కు చెందిన ఆరుగురు హైదరాబాద్లో బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాహనం నడుపుతున్న చిదంబర్కు కళ్లు తిరగడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవింగ్ సీటులో ఉన్న చిదంబర్ (52) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో మహిళలు మోనాలిసా, బింబాధర, పూల్రాణి, లక్ష్మిలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన కారు
లారీని ఢీకొని యువకుడు
రోడ్డుపై బైకు
ఎటపాక: ఎటపాక మండలం లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎటపాక మండలం గొమ్ము కోయగూడెం గ్రామానికి చెందిన మడకం వెంకటేష్ (36) ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పని నిమిత్తం నెల్లిపాక మీదుగా చింతూరు బయలుదేరారు. లక్ష్మీపురం వద్ద చింతూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. దీంతో వెంకటేష్ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పార్థసారధి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!