పేరు సర్కారుకు..అప్పులు ఉద్యోగులకు
ఏరు దాటకముందు ఏటి మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా ఉంది జిల్లా ఉన్నతాధికారుల తీరు. జిల్లాస్థాయిలో అట్టహాసంగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి, అందుకు మండల స్థాయి ఉద్యోగులతో లక్షలు ఖర్చు చేయించి..
సదరం శిబిరం బిల్లులు రాక లబోదిబో!
సదరం శిబిరం ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అప్పటి ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ, సబ్కలెక్టర్ అభిషేక్
చింతపల్లి, న్యూస్టుడే : ఏరు దాటకముందు ఏటి మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా ఉంది జిల్లా ఉన్నతాధికారుల తీరు. జిల్లాస్థాయిలో అట్టహాసంగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి, అందుకు మండల స్థాయి ఉద్యోగులతో లక్షలు ఖర్చు చేయించి.. బిల్లులు చెల్లించాల్సిన తరుణంలో పత్తా లేకుండాపోయారు. అప్పు తెచ్చి లక్షలు ఖర్చుపెట్టిన ఉద్యోగులు వడ్డీలు కడుతూ... తమకు బిల్లులు చెల్లించాలంటూ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గిరిజనులతో మమేకం అయ్యేందుకు పోలీసు శాఖ పలు సామాజిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది నవంబరు నెలలో చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా సదరం శిబిరాన్ని నిర్వహించాలని భావించారు. ప్రభుత్వ అనుమతితో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఇందులో భాగస్వాములను చేశారు. వీరి ఆదేశాల మేరకు నవంబరు 4, 5 తేదీల్లో చింతపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణలో శిబిరం ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో వచ్చే దివ్యాంగులకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అప్పటి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషేక్ (ప్రస్తుత ఐటీడీఏ పీఓ) అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ శిబిరానికి అయ్యే ఖర్చు మొత్తం ఐటీడీఏ భరిస్తుందని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులు భరోసా ఇవ్వడంతో చింతపల్లి సహాయ గిరిజన సంక్షేమాధికారి జయలక్ష్మి, సీఏహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామరాజు పడాల్ సుమారు రూ. మూడు లక్షల మేర వ్యయాన్ని భరించారు. శిబిరం జరిగే పాఠశాల ప్రాంగణాన్ని పొక్లెయిన్తో చదును చేయడం దగ్గరనుంచి రెండు రోజులపాటు సదరం శిబిరానికి వచ్చిన వారికి భోజనాలు వంటివి సమకూర్చారు. చింతపల్లి మండల పరిషత్తు కార్యాలయ సీనియర్ సహాయకుడు ఎన్.టి.రామారావు అప్పటి ఇన్ఛార్జి ఎంపీడీఓ రమేష్ సూచనతో సదరం శిబిరానికి పెట్టుబడి పెట్టారు. తనకున్న పరిచయాలతో తెలిసిన వారి దగ్గరనుంచి రూ. మూడు లక్షలు అప్పు చేశారు. ఆ డబ్బును టెంట్లు, ఇతరత్రా పనులకు వెచ్చించారు. ఇలా చింతపల్లిలో అధికారులంతా కలసి సుమారు సదరం శిబిరానికి రూ. 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల నుంచి పెద్దఎత్తున దివ్యాంగులు ఈ శిబిరానికి హాజరయ్యారు. సుమారు 15 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే వచ్చిన దివ్యాంగులతోపాటు వారి వెనుక సహాయకులుగా వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కల్పించారు.
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
ఇంతవరకు బాగానే ఉన్నా పెట్టుబడి పెట్టిన ఉద్యోగులకు మొండిచెయ్యి ఎదురైంది. శిబిరం నిర్వహణకు అయిన బిల్లులు నెలలో అవుతాయనుకుంటే... ఎనిమిది నెలలు కావస్తున్నా నేటికీ అతీగతీ లేదు. మీరు ముందు ఖర్చుచేసి బిల్లులు పెట్టండి... ఐటీడీఏ నుంచి బిల్లులు చెల్లిస్తాం అంటూ చెప్పిన అప్పటి ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ బదిలీపై వెళ్లిపోయారు. ఇన్ఛార్జి ఎంపీడీఓగా రమేష్ సైతం వేరేచోటకు వెళ్లిపోయారు. బిల్లులు చెల్లించేందుకు ఐటీడీఏలో నిధులు లేవు. దీంతో వీటిని ఎలా చెల్లించాలనే దానిపై ఇప్పుడు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకే కార్యక్రమానికి సంబంధించి రూ. లక్షల్లో బిల్లులు చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించకపోవడంతో చెల్లింపు ప్రక్రియ ఆగిపోయింది. మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి ఇవ్వాలన్నా అక్కడా సరిపడా నిధులు లేవు. బిల్లుల కోసం అధికారులను కలిస్తే ఉద్యోగి అయిన మీరు ఇంతెందుకు ఖర్చుచేశారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
* అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా బిల్లులకు అతీగతీ లేకపోవడంతో చింతపల్లి ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ సహాయకులు రామారావు కలెక్టర్, ఐటీడీఏ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తీసుకున్న అప్పులకు తన జీతం నుంచి ఎనిమిది నెలలుగా వడ్డీ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదే విషయంపై స్పందనలోనూ కలెక్టర్కు వినతులు ఇచ్చినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి