యోదుల చరితం.. నిత్య స్మరణం
గాంధీ విజ్ఞాన మందిరం.... తెలుగు రాష్ట్రాల్లో, విజయవాడ నగరంలో స్వాతంత్య్ర సమరయోధుల ఆధ్వర్యంలో నిర్మించిన ఏకైక భవనం ఇది. నాటి స్వాతంత్రోద్యమ పోరాటాలు, ఫలితాలను అందరికీ తెలియజెప్పేందుకు దాతలు, ప్రజల విరాళాలతో దీనిని నిర్మించారు.
విజయవాడలో ‘గాంధీ విజ్ఞాన మందిరం’
గవర్నర్పేట, న్యూస్టుడే
రూపుదిద్దుకుంటున్న భవనం
గాంధీ విజ్ఞాన మందిరం.... తెలుగు రాష్ట్రాల్లో, విజయవాడ నగరంలో స్వాతంత్య్ర సమరయోధుల ఆధ్వర్యంలో నిర్మించిన ఏకైక భవనం ఇది. నాటి స్వాతంత్రోద్యమ పోరాటాలు, ఫలితాలను అందరికీ తెలియజెప్పేందుకు దాతలు, ప్రజల విరాళాలతో దీనిని నిర్మించారు.
ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆశీర్వాదాలతో..
1974లో విజయవాడ నగరంలో కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ఏర్పడింది. 1975లో విజయవాడకు వచ్చిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సంఘం నేతలు కలిసి, భవన నిర్మాణంపై వినతిపత్రం సమర్పించారు. 1981, ఆగస్టు 14న అప్పటి ప్రభుత్వం 48 సెంట్ల స్థలం కేటాయించింది. నాటి ముఖ్యమంత్రి అంజయ్య ఎంతగానో సహకరించారు. 1986, మార్చి 10న నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు అన్నే అంజయ్య, కాట్రగడ్డ మధుసూదనరావు, తంగిరాల వీరరాఘవరావు, సత్తిరాజు రామమూర్తి, బండి తిరుపతయ్య, వేములపల్లి వామనరావు, నిమ్మగడ్డ వెంకటకృష్ణయ్య, పోలవరపు వెంకట సుబ్బారావు, నూతక్కి వెంకట రంగారావులు సంఘ కార్యవర్గ సభ్యులుగా వివిధ సంవత్సరాల్లో పనిచేసి, భవన నిర్మాణంలో తమదైన పాత్ర పోషించారు. 1988, జనవరి 20, 21 తేదీల్లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల మహాసభ నిర్వహించారు. దీనికి నాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ విచ్చేశారు.
సాంఘిక సంస్కరణల సదస్సుల నిర్వహణ
1992 డిసెంబరు 20న కృష్ణా జిల్లా సంఘ-సంస్కరణల సదస్సు నిర్వహించారు. సమాజం ఎదుర్కొంటున్న వరకట్న దురాచారం, అవినీతి, లంచగొండితనం, అశ్లీల సినిమాలు, స్త్రీలు, దళితులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు వంటి సాంఘిక రుగ్మతలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే 1996, అక్టోబరు 9న అవినీతి వ్యతిరేక ప్రదర్శన నిర్వహించారు. తరువాత చాలా కార్యక్రమాలు జరిగాయి.
స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ఆశయాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు, ఈ భవనం, స్థలం పర్యవేక్షించుటకు 1995, అక్టోబరు 26న సర్వోదయ ట్రస్ట్ను ఏర్పాటు చేసి రిజిస్టర్ చేశారు.
భవిష్యత్తరాల కోసం సరికొత్తగా..
* స్వాతంత్య్ర ఉద్యమంపై భవిష్యత్తరాలకు తెలియజెప్పేందుకు ప్రస్తుతం ఉన్న ఖాళీస్థలంలో విశాలమైన మ్యూజియం ఏర్పాటు చేయాలన్నదే సర్వోదయ ట్రస్ట్ ఆశయమని అధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు అంతస్థుల్లో ఉన్న భవనాన్ని సరికొత్త రూపంలో తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. భవనంపై 30 అడుగుల గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేశారు.
* మూడో అంతస్తులో ప్రపంచ స్థితిగతులను మార్చిన వివిధ దేశాల విప్లవ ఉద్యమాలు, ఆయా దేశాల స్వాతంత్య్ర ఘట్టాలు ఉంచుతారు.
* రెండో అంతస్తులో దేశ స్వాతంత్య ఉద్యమంలో ప్రధాన ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, సైమన్ గో బ్యాక్, క్విట్టు ఇండియా ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమ ఘట్టాలను ఉంచుతారు. మన రాష్ట్ర స్వాతంత్య్ర పోరాటాల చర్రిత ఉంచుతారు.
* ఒక అంతస్తులో సమావేశ మందిరం ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న భవనంలో స్వాతంత్య్ర ఉద్యమ పోరాటాలను తెలియజేసేలా రూపొందిస్తారు. శబ్ద, దృశ్య మాధ్యమంలో నేటి యువతను ఆకట్టుకునేలా దీన్ని రూపొందిస్తారు. దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని డాక్టర్ జి.వి.మోహన్ప్రసాద్ తెలిపారు.
బందరుతో పింగళికి ప్రత్యేక బంధం
గొడుగుపేట: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు బందరుతోనే అనుబంథం ఎక్కువ. ఆంధ్రజాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్న సమయంలోనే మువ్వన్నెల పతాకాన్ని రూపొందించి విజయవాడ భారత జాతీయ కాంగ్రెస్ సభలకు తీసుకెళ్లారు. కాంగ్రెస్పార్టీ సమావేశాల్లో కూడా బ్రిటీష్ యూనియన్ జెండానే ఎగుర వేసేవారు. 1909లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలకు హాజరైన పింగళి అక్కడ బ్రిటీష్ జెండానే ఎగురవేపి వందన సమర్పణ చేయడం చూసి బాధపడ్డారు. అప్పటినుంచి పట్టువదలిన విక్రమార్కుడిలా భారతజాతీయ జెండా తయారీలో నిమగ్నమయ్యారు. చివరకు 1921 మార్చి 30, 31 తేదీల్లో బెజవాడ విక్టోరియా మ్యూజియం హాల్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభల్లో బాపూజీ నమూనా జాతీయజెండా సమర్పించారు. పింగళి త్యాగాలకు గుర్తుగా మచిలీపట్నంలో పింగళి విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు కళాశాలకు ఆనుకుని ఉండే రాజుపేటలో ఓ వీదికి ఆయన పేరు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!