పుస్తకాలు మిగిలాయి
మైలవరం మండలానికి ఈ ఏడాది విద్యాశాఖ ద్వారా మొత్తం 62,190 పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా, విద్యార్థులకు పంపిణీ పూర్తయ్యాక అందులో 6 వేల పైగా పుస్తకాలు మిగిలిపోయాయి.
విద్యార్థుల తగ్గుదలకు తార్కాణం
మైలవరం మండల వనరుల కార్యాలయంలో పాఠ్య పుస్తకాలు
న్యూస్టుడే- మైలవరం, తిరువూరు: మైలవరం మండలానికి ఈ ఏడాది విద్యాశాఖ ద్వారా మొత్తం 62,190 పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా, విద్యార్థులకు పంపిణీ పూర్తయ్యాక అందులో 6 వేల పైగా పుస్తకాలు మిగిలిపోయాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 800 మందికి పైగా తగ్గటమే దానికి కారణమైతే, అన్ని మండలాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా పుస్తకాలు ఆయా మండల వనరుల కార్యాలయాల్లోనే మిగిలిపోయాయి. విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది 8వ తరగతి వరకు ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంతో పాఠ్య పుస్తకాల సంఖ్య భారీగా పెరిగింది. మూడు సెమిష్టర్లలో భాగంగా తరగతిని బట్టి ఒక్కో తరగతికి 10 నుంచి 16వరకు పాఠ్యపుస్తకాలు, వర్కుబుక్లను ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు సైతం అందజేసింది. గత ఏడాది విద్యార్థుల గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భారీగా ముద్రించి మండలాలకు పంపింది.
లక్షకు పైగా మిగులు
ఉమ్మడి జిల్లాలో 2, 3 సెమిస్టర్లకు సంబంధించి మొత్తం 6,34,418 పుస్తకాలను ఒకే దఫాలో ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు. పాఠశాలలు తెరిచిన ప్రారంభంలోనే మొదటి సెమిస్టర్కు సంబంధించి అదే సంఖ్యలో పది తరగతులకు కలిపి పుస్తకాలను సరఫరా చేశారు. పాఠశాలల విలీనం, కొవిడ్ అనంతరం పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు తరలివెళ్లటంతో విద్యార్థులు బాగా తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 98 పాఠశాలలు తగ్గటంతో పాటు, విలీనం పేరిట చాలా కాలం పాటు సాగిన దోబూచులాటతో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలను దూరం పంపటానికి ఇష్టపడని తల్లిదండ్రులు వారిని సమీప ప్రవేటు పాఠశాలలకు పంపించారు.
వచ్చే ఏడాదికి సర్దుబాటు,
సీవీ రేణుక, డీఈవో
సాధారణంగా విద్యార్థుల సంఖ్యకు అదనంగా 5 శాతం వరకు పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తారు. ఈ ఏడాది కూడా గతేడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను పంపాం. అయితే గతేడాదితో పోల్చితే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 12 వేల వరకు జిల్లాలో తగ్గారు. కొవిడ్తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. కొవిడ్ తగ్గటంతో సొంత పాఠశాలలకు వెళ్లటంతోనే స్వల్ప మార్పులు వచ్చాయి. దాని మేరకు పుస్తకాలు మండలాల్లో మిగిలిపోయాయి. మండలాల వారీగా క్షేత్రస్థాయి వివరాల నివేదిక ఆధారంగా వచ్చే ఏడాదికి సర్దుబాటు చేస్తాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.