బరులకు బారులు..!
సంక్రాంతి సంబరాలకు నెల రోజులు ముందే కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణకు కసరత్తు ప్రారంభించారు.
కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణకు భారీ కసరత్తు
కంకిపాడు, న్యూస్టుడే
సంక్రాంతి సంబరాలకు నెల రోజులు ముందే కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణకు కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా గత కొన్నాళ్లుగా ఈడుపుగల్లు, ఉప్పలూరు, గొడవర్రు, గండిగుంట, ఆకునూరు, బోళ్లపాడు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి, పెనమలూరు కేంద్రాలుగా ఉన్నాయి. కొత్తగా కంకిపాడు చేరింది. లాభనష్టాలతో బేరీజు లేకుండా ‘బరి’ నిర్వహణే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. డిసెంబరు రాగానే పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు చేయడం, పండగకి రెండు రోజులు ముందు చేతులెత్తేయడం షరామామూలైంది.
వాటాల్లో వివాదాలు
* కంకిపాడు శిబిరం నిర్వహణకు ఇప్పటికే రూ.5 లక్షల మేర ధరావతు వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యే సమక్షంలోనే తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. గత ఏడాది భాగస్వాములకు వసూళ్లలో వాటా ముట్టలేదనే విషయమూ దుమారం లేపింది.
* శిబిరాల నిర్వహణకు ఆజ్యం పోసిన ఈడుపుగల్లుపై ప్రధాన నాయకులు కన్నేశారు. కోలవెన్ను, ఈడుపుగల్లు నాయకులతో పాటు ప్రధాన ప్రజాప్రతినిధి సన్నిహితులు దీనిలో వాటా కోసం పట్టుపడుతున్నారు. రెండు వర్గాలూ శిబిరంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ పరోక్షంగా తెదేపా శిబిర నిర్వహణకు లోపాయికారిగా సహకరిస్తుందని చెబుతున్నారు.
* ‘హైక్లాస్’ జూదం నిర్వహించే ఉప్పలూరు బరిలో మంతెన, వేల్పూరు, పునాదిపాడు తెన్నేరు నాయకులు వాటాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరులు ఇద్దరు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతోందని మంతెన/తెన్నేరు సరిహద్దుల్లో శిబిరం ఏర్పాటుపై కరసత్తు మొదలైంది.
* గొడవర్రులో రైతువారీగా పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది వర్షానికి శిబిరం బురదమయమవ్వడంతో లంక గ్రామాలకు నిర్వాహకులు తరలారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఒకరి నాయకత్వంలోనే జరుగుతోంది. స్థానిక నాయకులు ఆశించినా ‘పట్టాల’కే పరిమితమవుతుందని చెబుతున్నారు. ఇక్కడా తెదేపా నాయకుల పరోక్ష మద్దతు లభిస్తోంది.
* గండిగుంట, బోళ్లపాడు, తాడిగడప, యనమలకుదురులో వాటాల పంపిణీ పక్రియ పూర్తయినట్లు సమాచారం. గోసాల, వణుకూరు మధ్యన శిబిరం ఏర్పాటుపై సమీక్ష చేస్తున్నారు. పోరంకి, కానూరుల్లో కోడి పందేల స్థానే గుట్టు చప్పుడు కాకుండా వ్యవస్థీకృత జూదశాలలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. కోలవెన్నులో నిత్యం రూ.కోట్లలో చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి.
* గత ఏడాది చలివేంద్రపాలెం, ప్రొద్దుటూరు, కుందేరు, నెప్పల్లికి చెందిన నాయకులు కలిసి శిబిరం ఏర్పాటుకు సిద్ధం కాగా, నిర్వహణపై అవగాహనలేమితో వెనుకడుగు వేశారు. లక్షల్లో పెట్టుబడి.. వరుస కుదిరితే అందకుమించి రాబడి జూద గృహ నిర్వహణకు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి భిన్నంగా కోడి పందేల శిబిరానికి రూ.లక్షల్లో పెట్టుబడి, మందీ మార్భలం అవసరం ఉంటుంది. వర్షం లేదా, ఇతర కారణాలతో రద్దయితే నష్టం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కొత్తగా ‘ధరావతు’ పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. పెద్దబజార్-చిన్నబజార్, మూడు ముక్కలాల, నంబర్లాట, దమాకా.. ఇలా కొత్తకొత్త ఆటలు రంగ ప్రవేశం చేశాయి. పట్టాకు రోజుకు రూ.2-3 వేలు చొప్పున రూ.6-9వేల వసూలు చేస్తున్నారు. మద్యం, బిర్యానీ, సిగరెట్టు, తినుబండారాల దుకాణాలకు డిమాండ్ను బట్టి ముందస్తు వసూళ్లు ప్రారంభించారు.
గుత్త మొత్తంగా..
కొన్ని శిబిరాల్లో మూడు నాలుగు విభాగాలను గుత్త మొత్తంగా లీజుకు ఇస్తున్నారు. నిర్వహణ, పెట్టుబడికి అనుగుణంగా లీజు ధర నిర్ణయిస్తున్నారు. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే కనీసం రూ.20 లక్షలకు సబ్-లీజు ద్వారా వచ్చే విధంగా చూస్తున్నారు. అదనపు రూ.10 లక్షల్లో పోలీసులు, రెవెన్యూ ‘మామూళ్లు’ 50 శాతం ఉంటున్నాయి. పొలం ఇచ్చిన రైతుకు ఎకరానికి రూ.20 వేల వరకు రెండో పైరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా సవ్యంగా జరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీల అండదండలు చాలా అవసరం. ఇంత రిస్క్ తీసుకుని శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారంటే ‘లోగుట్టు’ ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సంక్రాంతి నెల ముందే జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.