కల్యాణమస్తుకు ఆంక్షల ముడి
నందిగామలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహమైంది. కల్యాణమస్తు పథకం సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకుందామని సచివాలయానికి వెళ్లారు.
కంచికచర్ల, న్యూస్టుడే: నందిగామలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహమైంది. కల్యాణమస్తు పథకం సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకుందామని సచివాలయానికి వెళ్లారు. అక్కడ వధూవరుల కుటుంబాల బియ్యం కార్డుల నకళ్లు అడగ్గా.. వధువుకు మాత్రమే బియ్యం కార్డు ఉంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నందున వరుడికి లేదు. ఇద్దరికీ బియ్యం కార్డు ఉంటేనే పథకం వరిస్తుందని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. కఠిన నిబంధనలతో తాజాగా అమలవుతున్న కల్యాణమస్తు పథకానికి ఎంతో మంది నూతన జంటలు అనర్హులవుతున్నారు.
నిబంధనలే అవరోధం
పేదల ఇంట్లో పెళ్లి చేయాలంటే ఆర్థిక భారంతో కూడిన వ్యవహారం. ఆ భారాన్ని తగ్గించేందుకు గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. వైకాపా అధికారం చేపట్టాక గత ఏడాది సెప్టెంబర్లో ఆ పథకానికి వైఎస్సాఆర్ కల్యాణమస్తు, షాదీ-తోఫాగా నామకరణం చేసి నిబంధనలు కఠినతరం చేశారు. కల్యాణమస్తుకు దరఖాస్తు చేసుకోవాలంటే పెళ్లి ధ్రువపత్రంతో పాటు మరో 13 ధ్రువ పత్రాలు జత జేయాలి. ఎన్టీఆర్ జిల్లాలో 605 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద గతేడాది అక్టోబర్ నుంచి జనవరి 13 వరకు డీఆర్డీఏ పీడీ లాగిన్కు కేవలం 51 దరఖాస్తులు మాత్రమే అందాయి. చాలా సచివాలయాలకు ఇప్పటిదాకా దరఖాస్తులే రాలేదు. గతేడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉమ్మడి జిల్లాలో వేలల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారందరూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నాడు పేదలైతే చాలు
గత ప్రభుత్వంలో తెల్లరేషన్ కార్డు ఉన్న వధువు తల్లిదండ్రులు దరఖాస్తు చేస్తే నగదు అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టడంతో చాలా మంది పథకానికి దూరమవుతున్నారు. 2023లో ఏప్రిల్, జులై మినహా మిగిలిన నెలల్లో శుభ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత, విద్యుత్తు వినియోగం తదితర నిబంధనలు లబ్ధికి అవరోధంగా మారాయి. ఆర్థిక స్థోమత లేక చదువుకోని పేద కుటుంబాల ఆడ పిల్లలకు పథకం అందని ద్రాక్షగా మారింది.
అర్హులందరికీ లబ్ధి
అర్హులందరికీ లబ్ధి అందుతుందని, జనవరి 31లోగా దరఖాస్తు చేస్తే ఫిబ్రవరిలో, ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసిన వారికి మేలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుందని డీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!