బైపాస్కు విద్యుత్తు లైన్లు అడ్డు..!
‘మా పొలాలకు వెళ్లకుండా అడ్డుగోడలు ఎందుకు నిర్మిస్తున్నారు. వీటిని తొలగించాల్సిందే..’ అని ఇటీవల జిల్లా కలెక్టర్కు రైతులు విజ్ఞాపన పత్రం అందించారు. నున్న ప్రాంతంలో ఆందోళన చేశారు.
13 ప్రాంతాల్లో మార్చేందుకు ఏర్పాట్లు
ఈనాడు, అమరావతి
* ‘ఇప్పుడున్న హైటెన్షన్ విద్యుత్తు లైను మార్చితే.. నాకున్న ఎకరం పొలం వదులు కోవాల్సిందే. వారు ఇచ్చే.. పరిహారం ఏమాత్రం సరిపోదు. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఉన్న ప్రాంతంలోనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి..!’
-నున్న ప్రాంతానికి చెందిన ఓ రైతు జాతీయ రహదారి బైపాస్ నిర్మాణసంస్థ వద్ద చేసుకున్న విన్నపం..!
* ఇది ఒక రైతు గోడు కాదు.. పలువురు రైతులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. విజయవాడ బైపాస్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్తు లైన్లు మార్చాలని నిర్మాణ సంస్థ దాఖలు చేసిన దరఖాస్తుకు రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది.
* రెండు జిల్లాల్లో 13 చోట్ల హైటెన్షన్ విద్యుత్తు లైన్లు మార్చాల్సి ఉంది. దీనికి అదనంగా మరో 1.50 కిలోమీటర్లకు భూసేకరణ జరపాల్సి ఉంది. ఈ లైన్లు మార్చేందుకు రెండు జిల్లాల్లోనూ రైతులు అంగీకరించడం లేదు. దీంతో ఈప్రాంతాల్లో నిర్మాణం ఆగిపోయింది. కృష్ణా జిల్లాలో రెండు ప్రాంతాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో 11 ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. మొత్తం 30 కిలోమీటర్ల దూరం నిర్మాణానికి 20 కిలోమీటర్లు బీటీ వేసి రహదారి సిద్ధం చేశారు. నున్న ప్రాంతంలో సబ్స్టేషన్ ఉండటం, వీటీపీఎస్ లైన్లు ఉండటంతో పలు చోట్ల జాతీయ రహదారిమీదుగా వెళుతున్నాయి. వీటిని పక్కకు జరపాల్సి ఉందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
విజయవాడ బైపాస్ నిర్మాణం
‘మా పొలాలకు వెళ్లకుండా అడ్డుగోడలు ఎందుకు నిర్మిస్తున్నారు. వీటిని తొలగించాల్సిందే..’ అని ఇటీవల జిల్లా కలెక్టర్కు రైతులు విజ్ఞాపన పత్రం అందించారు. నున్న ప్రాంతంలో ఆందోళన చేశారు.
విజయవాడ బైపాస్ రహదారికి అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. తాజాగా జాతీయ రహదారి పక్కన ప్రహరీ నిర్మాణం చేయవద్దని, ప్రస్తుతం ఉన్న హైటెన్షన్ విద్యుత్తు తీగలు మార్చవద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన భూసేకరణకు తాజాగా రహదారి నిర్మిస్తూ కొత్త నిబంధనలు విధించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన ఆకృతుల ప్రకారమే నిర్మిస్తున్నామని గుత్త సంస్థ చెబుతోంది.
జాతీయ రహదారికి 2010లోనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. అలైన్మెంట్ పూర్తి చేసి 90 శాతం సేకరించారు. బీఓటీ కింద గామన్ సంస్థ చేపట్టాల్సిన ఈ రహదారి రద్దు చేశారు. హెచ్ఏఎం కింద మూడోసారి పిలిచిన టెండర్లలో మూడోప్యాకేజీని రూ.1148కోట్లకు మేఘా సంస్థ దక్కించుకుది. ఈఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంకా 20 శాతం వరకు పనులు మిగిలి ఉన్నాయి. జక్కంపూడి, గొల్లపూడి రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు కొంతమంది ఆర్బిట్రేషన్కు వెళ్లారు. అప్పటికే ఎకరాకు రూ.25 లక్షల నుంచి 50లక్షల వరకు పరిహారం చెల్లించారు. కొంతమంది రైతుల పరిహారం బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఇంకా ఎక్కువ మొత్తం కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 30 కిలోమీటర్ల దూరానికి గాను భూసేకరణ సమస్యతో 4కిలోమీటర్ల వరకు గుత్త సంస్థకు అప్పగించలేదు. ఈ రహదారి సర్వీసు రహదారులు లేకుండానే నిర్మాణం చేస్తున్నారు. జక్కంపూడి వద్ద 24 కి.మీ. నుంచి 27 కి.మీ వరకు భూమి అప్పగించలేదు.
* ప్రస్తుతం జిల్లాల విభజన ఈ ప్యాకేజీ నిర్మాణానికి సమస్యగా మారింది. కొంత భాగం ఎన్టీఆర్ జిల్లాలో మరికొంత భాగం కృష్ణా జిల్లాలోకి వెళ్లింది. గుత్త సంస్థ రెండు జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరపాల్సి వస్తోంది.
* కొత్త నిబంధన ప్రకారం ఈ రహదారిపై 100 కి.మీ. వేగంతో వాహనాలను అనుమతిస్తారు. ఈ సమయంలో రోడ్డుకు ఏవీ అడ్డంగా ఉండకూడదని ప్రహరీ నిర్మాణం చేయాలనేది నిబంధన. సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేసి ప్రికాస్ట్ కాంక్రీట్ ప్లాంక్స్ ఏర్పాటు చేస్తారు. వీటిని రైతులు అడ్డుకుంటున్నారు. రైతుల సమస్య పరిష్కారమైతే వచ్చే మార్చి 31నాటికి బైపాస్ సిద్ధం అవుతుందని గుత్త సంస్థ ప్రాజెక్టు మేనేజరు చంద్రశేఖర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.