ఉద్యమమే శరణ్యం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని.. ఉద్యమమే శరణ్యమని ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు.
ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు
మాట్లాడుతున్న విద్యాసాగర్. చిత్రంలో ఇక్బాల్, రాజుబాబు, రమేష్, సతీష్కుమార్ తదితరులు
గాంధీనగర్(విజయవాడ), న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని.. ఉద్యమమే శరణ్యమని ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు. నాలుగేళ్లుగా ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చకపోగా.. సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఉద్యమబాట చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీనగర్లోని ఎన్జీవో భవన్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేతన సవరణలో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇంటి అద్దె అలవెన్స్, ఫిట్మెంట్ని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. పే స్కేల్ జీవో ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏడాదిపైగా సమయం పట్టిందని విమర్శించారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను కొంత వరకు విడుదల చేయడం సంతోషకరమని, మిగిలిన బకాయిలు, రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ సెలవుల బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లకు రావాల్సిన మూడు డీఏల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏ ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరవుభత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల నుంచి వసూలు చేస్తున్న కాంట్రిబ్యూషన్ని ఉద్యోగుల ప్రాన్ అకౌంట్కు ప్రభుత్వం జమ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వం దఫదఫాలుగా మంత్రివర్గ కమిటీ, చీఫ్ సెక్రటరీతో అనేక సమావేశాలు నిర్వహించి, ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడం విచారకరమన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి ఎం.డి.ఇక్బాల్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు మాట్లాడుతూ.. ఉద్యోగుల మెడికల్తో పాటు పిల్లల చదువుల వివాహం నిమిత్తం ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో నాయకులు పి.రమేష్, బి.సతీష్కుమార్, బి.వి.రమణ, ఆర్.శ్రీనివాసరావు, డి.విశ్వనాథ్, బి.నాగేంద్రరావు, కె.శివలీల, సి.హెచ్.కృష్ణమోహన్, శ్రీరామ్, నజీరుద్దీన్, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం