ఏలూరు... ఏటికి మారేను..?
రెండు జిల్లాలు, ఆరు మండలాలు, లక్ష పైచిలుకు ఆయకట్టుకు సాగునీరందించే ఏలూరు కాల్వ నిర్వహణపై జలవనరులశాఖ అధికారుల అలసత్వం కొనసాగుతూనే ఉంది.
నిర్వహణ లోపంతో కడగండ్లు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
రెండు జిల్లాలు, ఆరు మండలాలు, లక్ష పైచిలుకు ఆయకట్టుకు సాగునీరందించే ఏలూరు కాల్వ నిర్వహణపై జలవనరులశాఖ అధికారుల అలసత్వం కొనసాగుతూనే ఉంది. ఖరీఫ్ సాగుకు ముందస్తుగా నీరు విడుదల చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్న తరుణంలో ప్రధాన కాల్వ తీరు అధ్వానంగా తయారైంది. చివరి ఆయకట్టు వరకూ నీరందించే సంగతి పక్కనబెడితే, అసలు కాల్వలో సక్రమంగా నీరు ప్రవహించడమే ప్రశ్నార్థకంగా మారింది. ప్రవాహానికి వీలుగా ప్రధాన కాల్వతో సహా ఉపకాల్వలను సిద్ధం చేయడంలో ఈ ఏడాది కూడా అధికారుల లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఫలితంగా నారుమళ్లకు, పొలాలకు నీరందించేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సన్నద్ధత నామమాత్రం
వాస్తవానికి ఏప్రిల్, మే నెలల్లో ప్రధాన, ఉప కాల్వల నిర్వహణ, మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. గతంలో నీటి సంఘాలను సమన్వయం చేస్తూ అధికారులు ఇందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టేవారు. వైకాపా ప్రభుత్వంలో ఏటా ఈ ప్రక్రియ ‘మమ’ అన్పించేస్తుండటంతో కీలక తరుణంలో ఆయకట్టు చివరి భూములకు నీరందడం గగనంగా మారుతుంది. కృష్ణాజిల్లా పరిధిలో ఏలూరు కాల్వ దాదాపుగా గన్నవరం నియోజకవర్గంలోనే ఉంది. సరైన నిర్వహణ చేపట్టకుండానే నీరు విడుదల చేయడంతో ప్రతిసారి ఎక్కడో ఒకచోట గుర్రపుడెక్క, తూడు, నాచు అడ్డుపడడం, దీని వల్ల ప్రధాన కాల్వ నుంచి పిల్ల కాల్వలకు వెళ్లవలసిన నీటి ప్రవాహం మందగిస్తుంది.
ఇంజిన్లే ఆధారం: నీటి ప్రవాహం తగినంతగా రాకపోవడంతో రైతులు పొలాలకు నీరందించేందుకు ఏటా ఆయిల్ ఇంజిన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది. ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులు సొంతగా వీటిని కొనుగోలు చేస్తుండగా, సన్న, చిన్నకారు రైతులు వాటిని అద్దెకు తెచ్చి నీరందాల్చిన దుస్థితి ఏర్పడింది. ఇందుకోసం వీరంతా రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే కాల్వలు సక్రమంగా ఉంటే నీటి ప్రవాహం సాఫీగా ఉండి పొలాలకు బోదెల నుంచి నీరు చేరుతుంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కన్పించడంలేదు. కోన్ని చోట్ల ప్రధాన కాల్వ నుంచే ఇంజిన్లతో నీరందిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని మూడు ప్రధాన మండలాల్లో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం అంచనా దాదాపు 60 వేల ఎకరాలు ఉండగా, పూర్తి ఆయకట్టుకు సరిపడా నీరందించడం కష్టసాధ్యమవుతుంది.
సామర్థ్యం..శుభ్రత ఏవీ?: వాస్తవానికి ఏలూరు కాల్వ పూర్తి సామర్థ్యం 1,650 క్యూసెక్కులు..కానీ ఎప్పుడూ వెయ్యి క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేసిన సందర్భాల్లేవు. ఒకవేళ అంతకుమించి విడుదల చేసినా కాల్వ గట్లు ఎంతవరకు పటిష్టంగా ఉంటాయనేది ప్రశ్నార్థకం. అందుకే చివరి భూములకు చేరినా, చేరకున్నా వెయ్యి క్యూసెక్కులతోనే సరిపెట్టాయాల్సి వస్తుంది. మరో వైపు రెండు జిల్లాల పరిధిలో 50కు పైగా గ్రామాల్లో మంచినీటి చెరువుల్ని ఈ కాల్వ ద్వారానే నింపి, రక్షిత పథకాల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంది. కాల్వ నిర్వహణ ఏనాడూ సక్రమంగా లేకపోవడంతో అపరిశుభ్రమైన నీటినే తాగునీటిగా వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది.
ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద కాల్వలో గుర్రపు డెక్క
జాడలేని పనులు: కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలోని 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఏలూరు కాల్వపై ఆధారపడి ఉంది. రైతులు ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి సాగుకు కృషి చేస్తుంటే, అధికారులు మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఏటా సాగు అవసరాలకు నీరు వదిలే ముందు ట్రాక్టర్లతో దమ్ము చేయడం, గుర్రపుడెక్క దట్టంగా అల్లుకుపోతే యంత్రంతో తొలగించడం వంటివి చేపడుతుంటారు. ఈ ఏడాది ఆ తరహా పనులు చేపట్టిన దాఖలాలు ఎక్కడా కన్పించలేదు. దీంతో కాల్వ పొడవునా డెక్క, నాచు కన్పిస్తుంది. ప్రతి ఖరీఫ్ మధ్యలో ఉంగుటూరు-బాపులపాడు మండలాల సరిహద్దు నుంచి ప్రవాహం మందకొడిగా ఉంటుంది. గుర్రపుడెక్క దట్టంగా అల్లుకుపోయినా, సకాలంలో తొలగించకపోవడమే దీనికి కారణంగా కన్పిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.