సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పురోగతి

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు యువకులను సిట్‌ అదుపులోకి తీసుకుంది.

Updated : 16 Apr 2024 14:08 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు యువకులను సిట్‌ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సీసీఎస్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా భావిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని