విధితో ఓడిన విజేత
ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆ యువకుడి తపన ముందు కష్టాలు నిలబడలేకపోయాయి. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టినా.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. విజేతగా నిలిచి సరికొత్త జీవితంలో అడుగుపెట్టి తనుకన్న కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్న సమయం
విద్యుదాఘాతంతో మారిన యువకుడి తలరాత
ఉద్యోగం సాధించినా.. కల్లలైన కలల జీవితం
జాయినింగ్ రిపోర్టు చూపుతున్న బాధితుడి కుటుంబ సభ్యులు
ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆ యువకుడి తపన ముందు కష్టాలు నిలబడలేకపోయాయి. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టినా.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. విజేతగా నిలిచి సరికొత్త జీవితంలో అడుగుపెట్టి తనుకన్న కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్న సమయంలో.. ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. ప్రమాదం రూపంలో విధి విపత్కర పరిస్థితిని కల్పించింది. విధి ఆడిన విద్యుదాఘాత నాటకంలో ఓడిన విజేత కథ ఇది. - న్యూస్టుడే, ధర్మవరం పట్టణం
ధర్మవరం మండలం కనుంపల్లికి చెందిన పెద్ద నాగన్న, సాకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరికి మూడెకరాల పొలం ఉంది. సాగు పనులు లేనప్పుడు కూలీకి వెళ్లేవారు. పెద్దకుమారుడు వ్యవసాయం చేస్తుండగా.. రెండో కుమారుడు నాగేంద్ర భాస్కర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐటీ చేశాడు. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి రెండేళ్ల పాప ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా 2019లో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీంతో జేఎల్ఎం ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. కష్టపడి కొలువు సాధించాడు. సీసీ కొత్తకోట పంచాయతీలో జేల్ఎం (జూనియర్ లైన్మ్యాన్) గ్రేడ్-2 ఉద్యోగిగా నియమిస్తూ అధికారులు నియామక ఉత్తర్వులు అందించారు. 2019 అక్టోబర్ 2న కొలువులో చేరాడు. ఉద్యోగం వచ్చిందని ఇంటిల్లిపాదీ సంబరపడ్డారు. కష్టాల నుంచి గట్టెక్కవచ్చని, కూతురిని మంచి పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించవచ్చని కలలు కన్నారు.
సంతోషంగా ఉన్న సమయంలో..
సంతోషంగా గడిపేస్తున్న సమయంలో విధి ఆయన జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. విధి నిర్వహణలో ఉండగా సీసీ కొత్తకోట పంచాయతీలోని నిమ్మలకుంట గ్రామంలో విద్యుత్తు సమస్య వచ్చింది. 2019 అక్టోబర్ 18న నాగేంద్ర భాస్కర్ విద్యుత్తు స్తంభాన్ని ఎక్కి మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో కిందపడ్డాడు. కాసేపు ప్రశాంతంగా కూర్చొని అనంతరం ద్విచక్ర వాహనంలో సొంత గ్రామమైన కనుంపల్లికి వెళుతుండగా తల తిరిగి కిందపడిపోవంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల కోసం బెంగళూరు వైద్యశాలకు తరలించారు.
చందాలు వేసుకొని వైద్యసేవలు..
బెంగళూరు, ధర్మవరం కనుంపల్లిలో ఉంటున్న యువకుడి అన్నదమ్ములు, బంధువులు చందాలు వేసుకొని బెంగళూరులోని ఓ వైద్యశాలలో రూ.20 లక్షల వరకు వెచ్చించి మెరుగైన వైద్యసేవలు అందించారు. రక్తపోటుతో బ్రెయిన్లో శస్త్రచికిత్స చేశారు. పక్షవాతం రావడంతో ఎడమ కాలు, చెయ్యి సహకరించడం లేదు. దీంతో ఉద్యోగానికి వెళ్లలేక ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కలలు కన్న జీవితం నెలలోపే కరిగిపోయింది.
ఉన్నతాధికారులకు నివేదించాం
జేఎల్ఎం గ్రేడ్-2 సిబ్బంది నాగేంద్ర భాస్కర్కు 2019లో జరిగిన ప్రమాదంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అధికారులకు నివేదిక పంపాము. ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. - జానకిరామయ్య, విద్యుత్తు ఏఈ
ఉద్యోగం లేదు.. సాయం అందలేదు
విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. అయినా.. సాధించిన ఉద్యోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయమూ అందలేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. కనీసం ప్రభుత్వం అందించే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో నాకు ఉద్యోగం ఉందని తిరస్కరిస్తున్నారు. ప్రతినెలా మందు బిళ్లల కోసం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చవుతోంది. నా భార్య డిగ్రీ వరకు చదివింది. పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కనీసం ఆమెకైనా ఉద్యోగం ఇప్పిస్తే రుణపడి ఉంటాం. - నాగేంద్ర భాస్కర్, జేఎల్ఎం, కనుంపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం