అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటాం
వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను భాజపా ప్రశ్నిస్తుంటే దౌర్జన్యాలకు పాల్పడుతోందని, ధర్మవరంలో భాజపా కార్యకర్తలపై వైకాపాకు చెందిన దుండగులు దాడిచేసి గాయపరిచారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు.
సమావేశంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీనివాసులు తదితరులు
గుంతకల్లు పట్టణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను భాజపా ప్రశ్నిస్తుంటే దౌర్జన్యాలకు పాల్పడుతోందని, ధర్మవరంలో భాజపా కార్యకర్తలపై వైకాపాకు చెందిన దుండగులు దాడిచేసి గాయపరిచారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుతో కలిసి విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పెద్దఎత్తున దారి మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అధికార పార్టీ నాయకులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులుతో వాహనాలను కొనుగోలు చేసి పార్టీ కార్యకర్తలకు ఇచ్చి రేషన్ డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసి పెద్దఎత్తున స్మగ్లింగ్కు పాల్పడుతున్నారన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్న సమయంలో ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టడం, ఉత్తుత్తి మాటలు, బటన్లు నొక్కడం నిత్యకృత్యంగా మారిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో 60 నుంచి 90 శాతం వరకు కేంద్రం నిధులేననీ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం అమ్మఒడి ఒక్కటేనని చెప్పారు. ఆ పథకం అమలులో అవకతవకలు, గందరగోళ ప్రకటనలు, ఆర్భాటం ఎక్కువయ్యాయన్నారు. మూడేళ్ల పాలనపై వ్యతిరేకత ఏర్పడి ప్రతి చోటా వైకాపా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో ప్రజలను మభ్యపెట్టడం కోసం అసత్య ప్రకటనలు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటామని, తమ కార్యకర్తలకు నష్టం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. భాజపా నాయకులు రామాంజనేయులు, వెంకటేశ్వరరెడ్డి, రవికుమార్, మంజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక