logo

‘మీ పథకాలు మాకొద్దు’

‘మీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు’ అని ఓ నాయకుడు అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరాఖండీగా చెప్పేశారు. తాడిమర్రి మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

Published : 02 Oct 2022 02:58 IST


బుక్‌లెట్‌ తీసుకునేందుకు నిరాకరిస్తున్న తెదేపా నాయకుడు శివయ్య

తాడిమర్రి, న్యూస్‌టుడే: ‘మీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు’ అని ఓ నాయకుడు అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరాఖండీగా చెప్పేశారు. తాడిమర్రి మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైకాపా నాయకులతో కలిసి ఎం.అగ్రహారంలో గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటా తిరుగుతూ గ్రామంలోని తెదేపా నాయకుడు శివయ్య  ఇంటికి వెళ్లారు. వైకాపా ప్రభుత్వం రూపొందించిన పథకాల బుక్‌లెట్‌ను ఇస్తుండగా తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే గ్రామంలోని వాలంటీరును పిలిచి ఆ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని