logo

రైలు వేళల్లో మార్పులు

గుంతకల్లు డివిజన్‌ గుండా ప్రయాణించే కొన్ని రైళ్ల వేళలను మార్పు చేసినట్లు డివిజన్‌ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్లులో ఉదయం 7.30కు బయలుదేరే గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్‌ రైలు(07655) ప్రస్తుతం 6.45కు బయలుదేరుతుంది.

Published : 04 Oct 2022 02:35 IST

గుంతకల్లు, న్యూస్‌టుడే: గుంతకల్లు డివిజన్‌ గుండా ప్రయాణించే కొన్ని రైళ్ల వేళలను మార్పు చేసినట్లు డివిజన్‌ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్లులో ఉదయం 7.30కు బయలుదేరే గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్‌ రైలు(07655) ప్రస్తుతం 6.45కు బయలుదేరుతుంది. గుంతకల్లు నుంచి చిక్‌జజూర్‌ వెళ్లే ప్యాసింజరు(07586) ఉదయం 7.40కు కాకుండా 7.15కు బయలుదేరుతుంది. న్యూదిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ గుంతకల్లుకు తెల్లవారుజాము 5.20కు వస్తుంది. ముంబయి- ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (11301) రాత్రి 10.30కు, నిజామాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 12.25కు, బెంగళూరు- నాందేడ్‌ రైలు తెల్లవారుజాము 5.50కు గుంతకల్లుకు వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని