‘వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్’
నియోజకవర్గ వ్యాప్తంగా 14 అంశాలపై సేకరించే ప్రజాభిప్రాయాలను రాష్ట్ర గవర్నర్, భారత రాష్ట్రపతికి పార్టీ అధిష్ఠానం ద్వారా నివేదిస్తామని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీకేపార్థసారథి పేర్కొన్నారు.
మలసముద్రంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్న బీకే పార్థసారథి, నాయకులు
గోరంట్ల, న్యూస్టుడే: నియోజకవర్గ వ్యాప్తంగా 14 అంశాలపై సేకరించే ప్రజాభిప్రాయాలను రాష్ట్ర గవర్నర్, భారత రాష్ట్రపతికి పార్టీ అధిష్ఠానం ద్వారా నివేదిస్తామని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీకేపార్థసారథి పేర్కొన్నారు. గోరంట్ల మండలం మలసముద్రం గ్రామంలో శుక్రవారం ‘ఇదేంఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సమస్యపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాలనపై ఇదేంఖర్మ అంటున్నారన్నారు. రహదారులు భవనాల శాఖమంత్రిగా కొనసాగిన ఎమ్మెల్యే శంకరనారాయణ ఒక్కరోడ్డు నిర్మించిన పాపానపోలేదని విమర్శించారు. తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పార్టీ మండల కన్వీనర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీహరిపురంలో కరపత్రం అందజేస్తున్న పరిటాల సునీత
‘పిచ్చోడి చేతిలో పాలన’
కుటాగుళ్లలో జరిగిన ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో కందికుంట, తెదేపా నాయకులు
రామగిరి: ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిచ్చివాడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన ఉందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం తలుపూరు, రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామంలో శుక్రవారం ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగైన పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరం లేదన్నారు. శ్రీహరిపురంలో వాల్మీకి, పరిటాల రవీంద్ర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అప్పుల్లో రాష్ట్రం ప్రథమ స్థానం
టి.పుట్లవాండ్లపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నాయకులు, కార్యకర్తలు
అమడగూరు: వైకాపా ప్రభుత్వం రైతులను దగా చేసిందని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. టి.పుట్లవాండ్లపల్లిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలసి వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అన్నారు. అప్పుల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానానికి తీసుకొచ్చిందన్నారు.
కదిరి: అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెదేపా బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కుటాగుళ్లలోని 1, 12, 36వ వార్డుల్లో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనా తీరు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికల ప్రచారం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేసిన వాగ్దానాలను ఏం చేశారని ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని ప్రశ్నించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గంగాభవానీ, ముస్తఫా, నాయకులు పర్వీన్బాను, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి