logo

ప్రేమకు అడ్డుగా ఉన్నాడని బాలిక తండ్రిపై దాడి

కదిరి మండలంలో ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ అదే గ్రామానికి చెందిన వంశీనాయక్‌ వెంటబడుతున్నాడు.

Published : 24 Mar 2023 06:09 IST

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి మండలంలో ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ అదే గ్రామానికి చెందిన వంశీనాయక్‌ వెంటబడుతున్నాడు. గురువారం సాయంత్రం ప్రత్యేక తరగతుల తరువాత పాఠశాల నుంచి బాలిక తండ్రి ఆమెను గ్రామానికి తీసుకెళ్తున్నాడు. దారి మధ్యలోకి అడ్డువచ్చి తనతో విద్యార్థినిని పంపాలని ఒత్తిడిచేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో వంశీనాయక్‌ బాలిక తండ్రిపై దాడిచేశాడు. అంతటితో ఆగక ఆయన తల్లిదండ్రులు రామ్మోహన్‌నాయక్‌, శారదతో పాటు మరికొందరి సాయం కోరుతూ ఫోన్‌ చేశాడు. అందరూ అక్కడికి చేరుకుని బాలికను తీసుకెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న ఆమె తండ్రిని చితకబాదారు. గొడవను చూసిన స్థానికులు మందలించి అక్కడి నుంచి పంపివేశారు.గాయపడిన బాలిక తండ్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రేమపేరుతో తన బిడ్డను వేధిస్తున్న వంశీనాయక్‌, ఆయనకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడునెలల కిందట వంశీనాయక్‌ బాలికకు మాయమాటలు చెప్పి కొన్నిరోజుల పాటు ఇతర ప్రాంతానికి తీసుకెళ్లాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని