logo

అధికారంలోకి వచ్చేది తెదేపానే

తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు.

Published : 20 Apr 2024 03:36 IST

తాడిపత్రి: ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న జేసీˆ అస్మిత్‌రెడ్డి

తాడిపత్రి, తాడిపత్రి పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో శుక్రవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి జేసీˆ అస్మిత్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా సుమారు 20 వేల మంది మందితో ర్యాలీ నిర్వహించారు. జేసీˆ ఇంటి వద్ద నుంచి పుట్లూరురోడ్డు, పోలీస్‌స్టేషన్‌ కూడలి మీదగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే జేసీˆ అస్మిత్‌రెడ్డి బుగ్గరామలింగేశ్వరస్వామి, సిద్ధిబాషా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నామినేషన్‌ వేసేందుకు బయలుదేరి వెళ్లారు. ర్యాలీలో ఎంపీˆ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, నాయకుడు జేసీˆ పవన్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీˆ ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్‌ అనంతరం జేసీ అస్మిత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో తప్పకుండా అధికారంలోకి తామే వస్తామన్నారు.  ఈకార్యక్రమంలో తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాల తెదేపా కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని