జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను.
భూ నిర్వాసితుల ఎదురుచూపులు
అంగుళం కూడా జరగని బీటీపీ కాలువ పనులు
మందలపల్లి వద్ద ఆగిపోయిన కాలువ పనులు
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను.
2023 జులై 8వ తేదీ కళ్యాణదుర్గంలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్
కళ్యాణదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, న్యూస్టుడే: కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని గత తెదేపా ప్రభుత్వం జీడిపల్లి- భైరవానితిప్ప- కుందుర్పి ఎత్తిపోతల పథకం కాలువ పనులు ప్రారంభించింది. జీడిపల్లి జలాశయం నుంచి కాలువ ద్వారా నీటిని తీసుకువచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులు, రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తరలించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. 2018 సంవత్సరం చివర్లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కళ్యాణదుర్గం మండలం గరుడాపురం వద్ద రూ.968కోట్ల వ్యయంతో కాలువ పనులు ప్రారంభించారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసి జీడిపల్లి నుంచి కృష్ణాజలాలు తీసుకువస్తామని ఆర్భాట ప్రకటనలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. ఉష శ్రీచరణ్ పదువులు అలంకరించారే తప్ప పనులపై శ్రద్ధ చూపలేదు.
ఇచ్చింది రూ.78కోట్లే..
కాలువ పనులకు 1,406 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలోనే సేకరించి పెట్టారు. రైతులకు పరిహారం అందకపోయినా సాగు జలాలు వస్తే చాలని స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చారు. ఆ భూముల్లో 25 శాతం మట్టి పనులు చేసి కాలువ తవ్వారు. ఆ భూములకు సంబంధించి ఇప్పటి వరకు వందలాది మంది రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు.
గతేడాది సీఎం రూ.208కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పి.. రూ.135కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.80కోట్లు రైతులకు పరిహారం కాగ మరో రూ.55కోట్లు సివిల్ వర్కులకు కేటాయించారు. 1,406 ఎకరాలకుగాను 789 ఎకరాలకు రూ.78కోట్లు పరిహారం ఇచ్చారు. ఇంకా 620ఎకరాలకు పరిహారం రావాల్సి ఉంది. సివిల్ పనుల్లో కేవలం ఐదు కిలోమీటర్లు కాలువ పనులు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి కమీషన్లకు కక్కుర్తి పడటంతో పనులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి.
నేటీకీ అందలేదు
బీటీపీ కాలువ పనులకు నా పేరు మీద సర్వే నంబర్ 331, 132లో 2.70 ఎకరాల భూమి పొంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి చెప్పారు. ఇప్పటికీ అతీగతీ లేదు. ఎనిమిది నెలల క్రితం పరిహారం ఇస్తామని అధికారులు పాసు పుస్తకాలు తీసుకున్నారు. కొంత మందికి మాత్రమే ఇచ్చారు. పరిహారం వస్తుందని అప్పులు చేసుకుని అవస్థ పడుతున్నా.
పాలక్షి, మందలపల్లి, కుందుర్పి మండలం
హమాలీ పని చేసి బతుకుతున్నా..
మా నాన్న మర్రిస్వామి పేరున ఉన్న 2.50ఎకరాల భూమి కాలువకు ప్రభుత్వం తీసుకుంది. భూమి పోయి ఉపాధి లేక బెంగళూరుకు వెళ్లి హమాలీ పని చేసుకుంటున్నా. భూమి ఇచ్చిన రైతులకు పరిహారం ఇస్తామని ఎనిమిది నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కళ్యాణదుర్గంలో ప్రకటిస్తే బెంగళూరులో ఉపాధి వదిలి గ్రామానికి వచ్చాను. ఇప్పుడు ఉపాధి పోయింది, అప్పులు మీదపడ్డాయి. నేటికీ పరిహారం రాలేదు. జీవనం కష్టంగా మారింది.
నాగరాజు, అపిలేపల్లి, కుందుర్పి మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులే.. అసురలై
[ 06-05-2024]
నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. -
ఉద్యోగులకు ప్రలోభాల ఎర
[ 06-05-2024]
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. -
ఎన్నికల ముందు హామీలు.. ఆనక నామాలు
[ 06-05-2024]
-
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అనంత అభివృద్ధి
[ 06-05-2024]
వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. -
గొడవలపై ఉక్కుపాదం మోపండి
[ 06-05-2024]
‘ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా పేర్కొన్నారు. -
తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు
[ 06-05-2024]
సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. -
వైకాపా వ్యతిరేక ఓటును ఆపేందుకు ప్రయత్నం
[ 06-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో.. స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. -
ఫాం-12 ఇచ్చాం.. మా పేర్లు ఏమయ్యాయి
[ 06-05-2024]
‘ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఫాం-12 సకాలంలో ఇచ్చాం. మేము పని చేసే చోటే ఆర్ఓలకు సమర్పించాం. ఇపుడు ఓటు వేసేందుకు వస్తే.. పేర్లు లేవంటారు. -
గుంతకల్లు భగభగ
[ 06-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.