పండుటాకులకు ఆశ్రమం
ముదిమి వయసులో బిడ్డల నిరాదరణకు గురైనవారు కొందరు, ఆస్తి ఇవ్వలేదని పిల్లలు పట్టించుకోని వారు మరికొందరు.. ఇలా ఎందరో వృద్ధుల కన్నీళ్లు తుడుస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తోంది తెలుగుతల్లి వృద్ధాశ్రమం.
ఆశ్రమంలో సేదతీరుతున్న వృద్ధులు
పుంగనూరు, న్యూస్టుడే: ముదిమి వయసులో బిడ్డల నిరాదరణకు గురైనవారు కొందరు, ఆస్తి ఇవ్వలేదని పిల్లలు పట్టించుకోని వారు మరికొందరు.. ఇలా ఎందరో వృద్ధుల కన్నీళ్లు తుడుస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తోంది తెలుగుతల్లి వృద్ధాశ్రమం. జీవితంలో అలసిన మనుషులకు సాంత్వన చేకూరుస్తోంది.
* పట్టణానికి చెందిన గాజుల నటరాజ, రేవతిలకు ఇద్దరు కుమారులు. ఇక్కడ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో 15 ఏళ్ల కిందట బెంగళూరు వెళ్లి చిరు వ్యాపారాలు చేశారు. 2008లో వారి చిన్న కుమారుడు విష్ణువర్ధన్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో సొంతూరైన పుంగనూరు వచ్చేశారు. నటరాజకు తెలుగుబాషపై మక్కువ ఎక్కువ. కుమారుడి జ్ఞాపకార్థం ఆ దంపతులు 2016లో పుంగనూరులో తెలుగుతల్లి వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. తమ సొంత భూమిలోనే కొన్ని షెడ్లు వేసుకుని వృద్ధులకు ఆశ్రయం కల్పించడం ప్రారంభించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పట్టణవాసులే గాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరాదరణకు గురైన వారు ఇక్కడ చేరారు. తమ సొంత నిధులతోనే మూడు పూటలా భోజనం అందిస్తూ ఆశ్రయం కల్పించారు. వారి సేవను గుర్తించి కొందరు దాతలు షెడ్లు, ఇతర వసతుల కల్పనకు ముందుకొచ్చారు. జన్మదినాలు, వర్ధంతులు, జయంతుల రోజున ఇక్కడ దాతలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.
కరోనా సమయంలోనూ సేవలు: వీరు పుంగనూరుతో పాటు తిరుపతిలోనూ ఆశ్రమాన్ని ప్రారంభించారు. వీరి సేవలను గుర్తించి ఓ దాత పాకాలలో ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. మూడు ప్రాంతాల్లో 120 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. కరోనా సమయంలో సైతం ఆశ్రమాలు కొనసాగాయి. ఎప్పటికప్పుడు వైద్యసేవలు, నాణ్యమైన భోజనం పెడుతున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, ఎవరి నుంచి ఆశించకుండా ఆశ్రమం నడుపుతుండటంతో దాతలే నేరుగా ఆశ్రమానికి వచ్చి పండ్లు, దుస్తులు, భోజనం అందిస్తున్నారు. దాతల సాయం అందని రోజుల్లో వ్యక్తిగతంగా వెచ్చిస్తున్నారు. ఆశ్రమంలో వయస్సు మీరి మృతి చెందిన 40 మందికి ఆశ్రమ నిర్వాహకులే అంత్యక్రియలు చేశారు.
పుట్టుకతోనే కంటిచూపు లేదు
నా పేరు లక్ష్మీదేవమ్మ. చిన్నప్పటి నుంచే కంటి చూపులేకపోవడంతో పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రులు, సోదరుని ద్వారా పోషణ సాగేది. పదేళ్ల కిందట తల్లిదండ్రులు, ఐదేళ్ల కిందట సోదరుడు మృతి చెందారు. దీంతో బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లడం ఇష్టంలేక ఇక్కడ ఆశ్రమం ఉందన్న సమాచారం తెలుసుకుని వచ్చేశా. అయిదన్నరేళ్లుగా ఆశ్రయం పొందుతున్నా. నాలాంటి వారికి ఇది దేవాలయం లాంటిది.
సంతోషంగా ఉంది
నా పేరు మరియమ్మ. పిల్లల ఆదరణ లేక ఇంటి వద్ద ఇబ్బందిపడుతుంటే మాకు తెలిసిన ఒకాయన నన్ను ఇక్కడకు తెచ్చారు. చేరిన నాటి నుంచి మూడు పూటలా కడపార తింటూ..ఆశ్రమంలోనే సేదతీరుతున్నా. పడకలు, దుస్తులు, మరుగుదొడ్లు తదితర వసతులు పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఇంటి దగ్గర కంటే ఇక్కడే సంతోషంగా ఉంది.
అప్పలాయగుంటలో మా సొంత భూమిలో 500 మంది అనాథలకు సరిపడే స్థాయిలో ఆశ్రమం నిర్మిస్తున్నాం. నా చిన్ననాటి కల అనాథాశ్రమం ఏర్పాటు. ఇప్పటికి నెరవేరుతోంది. పడకలో గల వృద్ధులను చూసుకోవడానికి ఎక్కడా సరైన వసతులు లేవు. వారికి పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచే కాకుండా చెన్నై, బెంగళూరు, కడప తదితర ప్రాంతాలకు చెందిన వారు ఆశ్రయం పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!