పగటి వెలుగు.. ప్రగతికి చేటు
పల్లెలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అతిపెద్ద సమస్యగా మారింది. స్విచ్బోర్డులు లేక విలువైన విద్యుత్తు వృథా అవుతుండగా బల్బుల సామర్థ్యం సైతం తగ్గిపోతోంది. సగానికి పైగా పల్లెల్లో బల్బులు పగలు సైతం వెలుగుతున్నాయి..
పల్లెలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అతిపెద్ద సమస్యగా మారింది. స్విచ్బోర్డులు లేక విలువైన విద్యుత్తు వృథా అవుతుండగా బల్బుల సామర్థ్యం సైతం తగ్గిపోతోంది. సగానికి పైగా పల్లెల్లో బల్బులు పగలు సైతం వెలుగుతున్నాయి.. వీటితో ప్రతినెలా రూ.50 కోట్ల వరకు అదనపు భారం పడుతున్నట్లు అంచనా. పట్టణాల్లో పేరుకుపోయిన బకాయిలు రూ.లక్షల్లో ఉండగా ఇప్పటికే ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న పంచాయతీలకు విద్యుత్తు బిల్లులు గుదిబండగా మారాయి. ఆర్థిక సంఘం నిధులు సర్దుబాటు చేస్తుండటంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గూడూరు, న్యూస్టుడే : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వీధి దీపాలు 18,530 ఉండగా వీటికి 25,812.23 కిలోవాట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. కనెక్షన్కు 402.67 యూనిట్ల చొప్పున ప్రతిరోజూ 74,61,475.1 యూనిట్లు వాడుతున్నారు. కేటగిరి 4ఎ కింద వీధి దీపాల టారిఫ్ లెక్కిస్తారు. అంటే రోజుకు యూనిట్ రూ.7 లెక్కన రూ.5.22 కోట్లు, నెలకు సరాసరి రూ.156.69 కోట్లు వీధి దీపాలకు స్థానిక సంస్థలు చెల్లించాల్సి వస్తోంది.
స్విచ్లదే ప్రధాన సమస్య
పల్లెల్లో చాలాచోట్ల ఆన్-ఆఫ్ స్విచ్లు లేకపోవడంతో రాత్రీపగలు వీధీ దీపాలు వెలుగుతున్నాయి. దీంతో బిల్లులు తడిసి మోపెడువుతున్నాయి. వేసవిలో కరెంట్ కోసం అష్టకష్టాలుపడ్డ విద్యుత్తు సంస్థలకు కొన్ని రోజులు సరఫరా ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ సమయంలోనూ వీధి దీపాల పగటి వెలుగులు కన్పించడం గమనార్హం. మీట ఏర్పాటు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలది కాగా చాలాచోట్ల గాలికి వదిలేశారు. నిధుల లేమితో కొత్తవి బిగించే పరిస్థితి లేదు. వీటికోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత విద్యుత్తు సంస్థలపై ఉంది. గతంలో ఉన్న స్తంభాలకు దీపాలు బిగించి వాడుతున్నారు. మరో లైన్ వేస్తే మీటల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని స్థానికసంస్థలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిర్వహణ బాధ్యత గతంలో ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంతో వాటిని ఆన్లైన్లో నిర్వహించేవారు. ప్రభుత్వం మారాక ఆ బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలు చూస్తున్నా ఇక్కడ వీధి దీపాలు కొత్తగా వేసే పరిస్థితి లేదు. బల్బులు కావాలని అడుగుతున్న కౌన్సిలర్లకు చేదు అనుభవం ఎదురవుతోంది. నిధుల లేమే దీనికి ప్రధాన కారణం.
ఇలాంటి స్విచ్బోర్డుల ఏర్పాటెక్కడ
బిల్లుల భారం ఇలా..
* చంద్రగిరి మండలంలో 434 వీధి దీపాలు ఉన్నాయి. వీటికి 554.36 కిలోవాట్ల విద్యుత్తు వినియోగిస్తుండగా యూనిట్కు రూ.7 చొప్పున నెలకు రూ.12.51 లక్షలు ఈ మండలం నుంచి వీధి దీపాలకు చెల్లించాల్సి ఉంది.
* వెంకటగిరి పురపాలిక, గ్రామీణ పరిధిలో 301 వీధి దీపాలు ఉండగా 273 కిలోవాట్ల విద్యుత్తు వాడుతున్నారు. నెలకు సరాసరి ఒక్కో కనెక్షన్కు 2,242 యూనిట్ల వినియోగం జరుగుతుండగా పురపాలికతోపాటు పంచాయతీలు కలిపి రూ.47.23 లక్షలను వీధి దీపాల బిల్లులకు చెల్లించాల్సి వస్తోంది.
* నాయుడుపేట మండలం, పట్టణ పరిధిలో 308 వీధి దీపాలు ఉన్నాయి. 390 కిలోవాట్ల విద్యుత్తు వాడకం ఉంది. ఇందుకోసం రూ.40.40 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఏర్పాటుకు ఆదేశాలిచ్చాం - వెంకటరమణ, డీఎల్పీవో, గూడూరు
పంచాయతీల్లో స్విచ్బోర్డుల ఏర్పాటుకు ఆదేశాలిచ్చాం. వీధి దీపాల నిర్వహణ బాధ్యత సచివాలయ సిబ్బందిపైనా ఉంది. కొన్నిచోట్ల వీధి దీపాలకు ప్రత్యేక లైన్ లేకపోవడం సమస్యగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
262.. ఉఫ్ఫ్ఫ్.. పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM