ఉన్నతి.. సేవానిరతి
ఒకప్పుడు కూతురంటే చిన్నచూపు. మగపిల్లలపై చూపిన ప్రేమ ఆడపిల్లలపై ఉండేది కాదు. పరిస్థితులు మారాయి. కంటే కూతుర్నే కనాలి అన్నట్లు సమాజం మారింది. కుమారులతో సమానంగా కుటుంబ బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకున్నారు.
నేడు కుమార్తెల దినోత్సవం
ఒకప్పుడు కూతురంటే చిన్నచూపు. మగపిల్లలపై చూపిన ప్రేమ ఆడపిల్లలపై ఉండేది కాదు. పరిస్థితులు మారాయి. కంటే కూతుర్నే కనాలి అన్నట్లు సమాజం మారింది. కుమారులతో సమానంగా కుటుంబ బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకున్నారు. ఉన్నత స్థితికి కారణమైన తల్లిదండ్రులు అండగా నిలుస్తూ.. బాగోగులు చూడటంతోపాటు వారి సేవలు కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంకొందరు సోదరులకు చేయూతనిస్తున్నారు.
- న్యూస్టుడే, తిరుపతి(విద్య), శ్రీకాళహస్తి, పుత్తూరు, ఏర్పేడు, గంగాధర నెల్లూరు
ఆశయ బాట.. ఆప్యాయతల పూదోట
తండ్రి బలరామయ్యతో సృజన
తండ్రి బాటలో నడుస్తూ.. ఆయన చేస్తున్న సామాజిక సేవలు కొనసాగిస్తున్నారు.. తొట్టంబేడు మండలం పూడి పంచాయతీకి చెందిన ఐఏఎస్ అధికారిణి సృజన. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఈమె.. విశ్రాంత ఐఏఎస్ అధికారి బలరామయ్య, సుగుణశీల కుమార్తె. తండ్రి ప్రోత్సాహంతో ఐఏఎస్ అయిన ఆమె.. సమాజ సేవ, లలిత కళల ఆదరణ విషయంలో తండ్రికి వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు పది రోజుల ముందే స్వగ్రామం పూడికి వచ్చేస్తారు. గ్రామంలోని పిల్లలు, యువత, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి ప్రతిభ చూసిన వారికి బహుమతులు అందజేస్తారు. పౌరాణిక నాటకాలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఇవన్నీ తండ్రి బలరామయ్య చేసేవారు. సృజన తన భుజస్కంధాలపై వేసుకుని తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందారు. ఈమె భర్త రవితేజ హైకోర్టు న్యాయవాది.
అన్న కుటుంబానికి అండ
కుమార్తె శ్రీజతో పద్మావతి
గూడూరుకు చెందిన రామమ్మ, రమణయ్య దంపతుల కుమారై పద్మావతి. తండ్రి రమణయ్య ప్రైవేటు ఉద్యోగి. తల్లి రామమ్మ నిరక్షరాస్యురాలు. కుమారులతో పాటు కుమారైను చదివించారు. చిన్ననాటి నుంచి విద్యపై పద్మావతి మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. 1998లో ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. భర్త హరీంద్రనాథ్ తితిదేలో ఆర్1లో డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. తన ఉన్నతికి కారణమైన తల్లిదండ్రుల బాగోగులు చూశారు. అనారోగ్యం చేయడంతో వారు చనిపోయేవరకు అన్నీ తానై సపర్యలు చేసింది. అన్న చనిపోవడంతో ఆయన కుటుంబం కష్టాల్లో చిక్కుకుంది. కుటుంబ బాధ్యతలు కొంతవరకు తన భుజస్కంధాలపై వేసుకుంది. పిల్లల చదువులకు చేయూతనిస్తోంది.
అమ్మకు ఆసరా..
ఏర్పేడు మండలం మునగలపాళెంకు చెందిన రత్నమాల, నాగేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె నవ్య. తండ్రి దూరమైనా అమ్మకు అండగా ఉంటోంది. తల్లిదండ్రులు నవ్యను ఎంటెక్ వరకు చదివించి... బంగారుపాళ్యానికి చెందిన రామకృష్ణతో పదేళ్ల కిందట వివాహం జరిపించారు. 2016లో ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి నాగేశ్వరరావు మృతి చెందంతో తల్లి రత్నమాల ఒంటరిగా మిగిలారు. తల్లి బాధ్యతలు కుమార్తె నవ్య తీసుకుంది. కుటుంబానికి పెద్దదిక్కై తల్లి ఆలనాపాలన చూస్తున్నారు. కొన్నేళ్లపాటు అమ్మకు తోడుగా ఉంటూ జీవనం సాగించారు. ఉద్యోగరీత్యా మూడేళ్ల కిందట భర్తతో కలిసి దుబాయిలో స్థిరపడినా తల్లి బాగోగులు చూస్తూ స్ఫూర్తిగా నిలిచింది.. నవ్య.
కంటే కూతుర్లనే కనాలనేలా..
జయలక్ష్మి, లీలావతి, త్రివేణి, మల్లిక
గంగాధరనెల్లూరు మండలం కలిజవేడు పంచాయతీ బొమ్మవారిపల్లెకు చెందిన చిన్నకారు రైతు రాజేంద్ర నాయుడుకు నలుగురు కుమార్తెలు. కొడుకు పుట్టలేదని మొదట బాధ అనిపించినా కుమార్తెలు జయలక్ష్మి, లీలావతి, త్రివేణి, మల్లికను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకున్నారు. చదివించే స్తోమత లేకపోవడంతో వారిని చదివించడం ఎందుకని బంధుమిత్రులన్నారు. వీరు నలుగురు ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదివి అత్యుత్తమంగా రాణించారు. జయలక్ష్మి ఎంబీఏ, లీలావతి బీటెక్, త్రివేణి బీటెక్, మల్లిక బీటెక్ చదివి హైదరాబాద్, బెంగళూరులో ఆకర్షణీయమైన వేతనాలతో ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి మరణానంతరం.. క్రమశిక్షణతో మెలుగుతూ తమ వేతనాన్ని తల్లికి ఇస్తూ.. పక్కాఇల్లు నిర్మించడంతో పాటు తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కుమారుడు పుట్టలేదన్న బాధను వీరి చదువు, ప్రవర్తన, నడవడికతో తీరిందని తల్లులు వాణి, శారద అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!