పర్యాటకం.. ఎటో నీ పయనం?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు వేశారు.
స్వదేశ్ దర్శన్పై ముందుకు పడని అడుగులు
ఉమ్మడి జిల్లాలో ఇదీ దైన్యం
ఈనాడు - తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు వేశారు.. నిధులూ వచ్చాయి.. రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు మాత్రం కానరావడం లేదు. నిధులను సకాలంలో వ్యయం చేయించాలన్న కృతనిశ్చయం లేక.. పనులు ఎందుకు ఆగాయో సమీక్షించేవారు కానరాక.. ఆయా ప్రాంతాలకు వెళ్లిన సందర్శకులు సరైన వసతులు లేక అల్లాడుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. కొత్త ప్రతిపాదనలు అటుంచి.. కేంద్రం స్వదేశ్ దర్శన్ పేరిట విడుదల చేసిన నిధులపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాకు వచ్చే సందర్శకుల్లో అత్యధిక మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వీరిని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేలా ఆకర్షిస్తే స్థానిక ప్రజల జీవనోపాధులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో ఏడు ప్రాంతాలను స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిపాదించారు. వాటి పరిస్థితి ఎలా ఉందంటే..
పని: పర్యాటక భవన్ నిర్మాణం
ఎక్కడ: తిరుపతి రుయా ఆసుపత్రి ఎదురుగా.
కేటాయింపు: రూ.5 కోట్లు
ప్రస్తుత స్థితి: పనులు మధ్యలో ఆగాయి.
ప్రయోజనం: ఇది పూర్తయితే గదుల కేటాయింపు ద్వారా ఆదాయం పొందొచ్చు. శ్రీవారి భక్తులకు వసతి సమస్య తీర్చొచ్చు.
పని: సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అభివృద్ధి
ఎక్కడ: కుప్పం ప్రాంతం గుడివంకలో
కేటాయింపు: రూ.5 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: కొంత మెట్ల దారి, గుడి పునర్నిర్మించారు.
పని: పర్యాటకులకు సదుపాయాల కల్పన
ఎక్కడ: గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయం వద్ద
కేటాయింపు: రూ.కోటి
ప్రస్తుత స్థితి: పనులు ముందుకు సాగలేదు.
వివాదాల పరిష్కారంలోనూ..
పర్యాటకశాఖ వివాదాలు పరిష్కరించే విషయంలోనూ దృష్టిసారించట్లేదన్న విమర్శలున్నాయి. అలిపిరి వద్ద దేవలోక్ పేరుతో ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి పర్యాటక శాఖకు చెందిన 38 ఎకరాలను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఈ ప్రాజెక్టును ఆ తర్వాత పక్కన పెట్టడంతో గుత్తేదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటి వరకు సమస్య పరిష్కారానికి నోచలేదు.
* ఏర్పేడులో పర్యాటక విశ్వవిద్యాలయ ఏర్పాటు ప్రతిపాదన దశ దాటలేదు.
* వెంకటాపురం చెరువును ఎకో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి, కృష్ణాపురం, అరణియార్ జలాశయాల్లో బోటింగ్కు అడుగులు పడలేదు.
దృష్టి సారిస్తున్నాం
జిల్లాల పునర్విభజన తర్వాత ఎక్కడెక్కడ పర్యాటక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయనే అంశంపై దృష్టిసారించాం. ఈ నెల 12న జిల్లా పర్యాటక అభివృద్ధిపై సమీక్షించనున్నాం. ఇందులో ఎక్కడెక్కడ పనులు చేపట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం.
రూపేంద్రనాథ్రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం