పువ్వుకో పరిమళం
శ్రీవారితోపాటు తితిదే ఆలయాల్లో ఉపయోగించే పుష్పాల నుంచి తయారు చేసే ఏ వస్తువునైనా పవిత్రంగా భావించి తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు.
రసాయనాలు లేని అగరబత్తీల తయారీ
అగరబత్తీలు తయారు చేస్తున్న మహిళలు
న్యూస్టుడే, తిరుపతి(గ్రామీణ): శ్రీవారితోపాటు తితిదే ఆలయాల్లో ఉపయోగించే పుష్పాల నుంచి తయారు చేసే ఏ వస్తువునైనా పవిత్రంగా భావించి తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. తిరుమలతోపాటు స్థానిక ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు వినియోగించే పూలను సద్వినియోగం చేస్తూ తితిదే అగరబత్తీలు తయారు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో పుష్పం నుంచి ఒక్కో రకమైన అగరబత్తీలు ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా ఆయా పుష్పాల పరిమళాలను భక్తులు ఆస్వాదించేలా తిరుపతిలోని తితిదే ఎస్వీ గో సంరక్షణ శాలలో వీటిని తయారు చేస్తుండగా.. భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది.
రంగు మారకుండా..
ముందుగా పుష్పాలన్నీ విడి విడిగా వేరుచేసి వాటిని ఒక డ్రై మెషీన్లో వేసి వేడి గాలి ద్వారా వాటి రంగు మారకుండా పూలు ఎండిపోయేలా చేస్తున్నారు. వీటిని మిక్సర్లో వేసి పొడి చేస్తారు. కన్వేయర్స్లో పొడి వేయడంతోనే కింద ఉన్న అగరు పుల్లలపైన పొడి పడేలా చేస్తున్నారు. దాన్ని రెండు రకాలుగా చేసి సెంట్, ఫ్లోరాకి సంబంధించిన యంత్రాలలో వేసి బత్తీ మాదిరి చేస్తారు. ఫ్లోరా బత్తీలకు ఎలాంటి శ్రమ అవసరం ఉండదు. వాటిని ఫ్లవర్ కోటింగ్ యంత్రంలో వేసి నేరుగా చేస్తారు. మరోవైపు సెంట్ బత్తీల పద్ధతి వేరుగా ఉంటుంది. ఈ విధానంలో బత్తీలను ఆరబెట్టి, ద్రవ యంత్రం ద్వారా మూడు రకాల పరిమళాలను జత చేస్తారు. ఆ తర్వాత మరో యంత్రంతో వీటిని ప్యాకింగ్ చేస్తారు. ఇక్కడ మహిళలు బృందాలుగా విడిపోయి పనిచేస్తుంటారు. పూలని విడగొట్టడం నుంచి వాటి ప్యాకింగ్ వరకు అంతా వీళ్లే చూసుకుంటారు. ఇందుకు కావాల్సిన వెదురు కర్రలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ఆలయాల నుంచి సేకరించిన పూలమాలలు
కేంద్రాల్లో విక్రయం
అగరబత్తీల్లో ఫ్లోరా నాలుగు రకాలు, సెంట్ మూడు రకాలు. వీటిలో దివ్య దృష్టి, దివ్య సృష్టి, ఆకృష్టి, దివ్య తుష్టి అనే నాలుగు రకాల ఫ్లోరా బత్తీలు ఉన్నాయి. దాంతో పాటు తందనాన, దివ్యపాద, అభయహస్త అనే పరిమళాలతో సెంట్ బత్తీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కో యంత్రం ద్వారా 100 కిలోల పొడి నుంచి 504 ఫ్లోరా, 940 సెంట్ బత్తీలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రోజువారీగా తితిదేకి పంపిస్తారు. తితిదే నిర్దేశించిన కేంద్రాల్లో వీటి విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రతి వస్తువుకు ఒక పరమార్థం
వ్యర్థం నుంచి సంపద అనే పద్ధతిలో స్వామి, అమ్మవార్లకు ఉపయోగించిన పూలమాలలతో తితిదే అగరబత్తీలు తయారు చేయిస్తోంది. దీని ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో తితిదే కేంద్రం ఏర్పాటు చేసింది.
డాక్టర్ కె.హరినాథ్రెడ్డి, ఎస్వీ గోసంరక్షణశాలసంచాలకులు
ఏడు కొండలు.. ఏడు రకాలు
స్వామి, అమ్మవార్లకు వాడే పూలమాలలన్నీ సేకరించి వాటిని విడగొట్టి ఏడు రకాల అగరబత్తీలు తయారు చేస్తున్నారు. రోజా పూల నుంచి తుష్టి, కలువ నుంచి దృష్టి, చామంతి నుంచి సృష్టి రకాలు చేస్తుండగా.. మూడింటినీ కలిపి ఆకృష్టి బత్తీలు తయారవుతున్నాయి. వీటిలో ఫ్లోరా నాలుగు, సెంట్ అగరబత్తీలు మూడు రకాలు ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకి దాదాపు 15వేల బాక్సులు తయారు చేస్తున్నారు. ఫ్లోరా, సెంట్ అగరబత్తీల తయారీ విధానం వేర్వేరుగా ఉంటుంది.
మహిళలకు ఉపాధి
కేంద్రంలో 74 మంది మహిళలు, 14 మంది పురుషులు పని చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి పొందుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం