యుగళం ప్రతిధ్వనించాలని
పరిశ్రమలు రాక నిరుద్యోగ యువతకు ఉపాధి కరవు.. గ్రామాల్లో వలస బాట.. మూడున్నరేళ్లు గడిచినా నోటిఫికేషన్ల జారీలో జాప్యం.. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీటి సమస్య.
లోకేశ్ తొలి అడుగుకు కుప్పం సిద్ధం
పాదయాత్రగా ప్రజలతో మమేకం కానున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఈనాడు-తిరుపతి, కుప్పం పట్టణం, న్యూస్టుడే: పరిశ్రమలు రాక నిరుద్యోగ యువతకు ఉపాధి కరవు.. గ్రామాల్లో వలస బాట.. మూడున్నరేళ్లు గడిచినా నోటిఫికేషన్ల జారీలో జాప్యం.. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీటి సమస్య.. రాష్ట్ర రాజధాని అమరావతిపై నిర్లక్ష్యం.. పలు కారణాలను చూపిస్తూ పింఛన్ల కోత.. ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, భూ దందాలు.. పెరిగిన విద్యుత్తు, నిత్యావసర ధరలు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకుని వారికి సాంత్వన చేకూర్చడంతోపాటు రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజలకు అందించనున్నారనే విషయాలను తెలియజేసేందుకు శుక్రవారం నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.
వేర్వేరుగా గ్యాలరీలు
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తొలి అడుగుకు కుప్పం సిద్ధమైంది. రహదారులు, వీధులన్నీ తోరణాలు, భారీ కటౌట్లు, బ్యానర్లతో పసుపుమయం అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున గురువారం తరలివచ్చారు. భారీ బహిరంగ సభ, గ్యాలరీల ఏర్పాట్లు పరిశీలించారు. సభా వేదికపై 300 మందికి, గ్యాలరీల్లో లక్ష మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. మహిళలకు రెండు, వీఐపీ రెండు, ప్రజలకు 10 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు 500 మంది వాలంటీర్లు, 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ ఉంటుందని నాయకులు తెలిపారు.
వంటల ఘుమఘుమలు..
సభకొచ్చే ప్రజల ఆకలి తీర్చేందుకు సభా ప్రాంగణ సమీపంలో మూడు భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమతమూరు రోడ్డులో రెండు చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 30 వేల మంది, సభా ప్రాంగణ సమీపంలో 20 వేల మంది భోజనాలు చేసేందుకు వీలుగా షామియానాలు వేస్తున్నారు.
తెలుగు యువత ప్రదర్శన
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కుప్పం నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల ఇన్ఛార్జులు, కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మణి ఆధ్వర్యంలో గురువారం గ్రామాల్లో ద్విచక్ర వాహన ప్రదర్శన చేశారు. ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను దిగ్విజయం చేయాలని కోరారు.
తొలిరోజు ఇలా..
ఈనాడు డిజిటల్, చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో నారా లోకేశ్ తొలిరోజు చేపట్టే ‘యువగళం’ పాదయాత్ర వివరాలు విడుదలయ్యాయి.
ఉదయం 10.15: కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయలుదేరి లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు.
11.03: పాదయాత్రలో భాగంగా తొలి అడుగు వేసి.. సీనియర్ కార్యకర్తల నుంచి ఆశీస్సులు తీసుకోనున్నారు.
11.30: లక్ష్మీపురం మసీదులో ప్రార్థనలు
11.55: హెబ్రోన్ చర్చి సందర్శన, ఆపై పాదయాత్ర
12.45- 1.25: అంబేడ్కర్, ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.
2.40: తెదేపా కార్యాలయం వరకు పాదయాత్ర.
3.00: కమతమూరు రోడ్డులోని బహిరంగ సభ స్థలానికి చేరుకుంటారు.
4.35- 6.45: బైపాస్ కూడలి నుంచి పీఈఎస్ వైద్య కళాశాల వరకు పాదయాత్ర. అక్కడ రాత్రి బస.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు