logo

‘తెదేపా ఎమ్మెల్యేలపై దాడి తగదు’

శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి  చేయడం తగదని తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ అన్నారు.

Published : 21 Mar 2023 02:58 IST

తిరుపతి(నగరం): శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి  చేయడం తగదని తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఆ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. ప్రభుత్వ పాలనను నిలదీస్తున్న తెదేపా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించడం ద్వారా గుండాగిరి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దాడిని  మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రకటనలో ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని