logo

వైకాపా ఒంటరిగా పోటీ: మంత్రి రోజా

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా వైకాపాకు ఉందని రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజా అన్నారు.

Updated : 30 Mar 2023 12:12 IST

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా వైకాపాకు ఉందని రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. బుధవారం తిరుపతి శిల్పారామంలో అఖిల భారత డ్వాక్రా బజారు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాకు టచ్‌లో ఉన్నారని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు చంద్రబాబుకు తమ నేత ఎన్టీఆర్‌ గుర్తు రాలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆవిర్భావ దినోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎందుకు కళాశాలలు, యూనివర్సిటీలకు ఎన్టీఆర్‌ పేరు పెట్టలేదని ప్రశ్నించారు.పాదయాత్రలో లోకేశ్‌ ఇష్టానుసారంగా మాట్లాడటం తగదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని